తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19మధ్య రాష్ట్రవ్యాప్తంగా 22లక్షలకు పైగా ఎల్ ఈడి వీధి దీపాలు..చంద్రకాంతుల్లో ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానం.. మరి నేడో చీకటి ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్..గత 4ఏళ్లుగా రాష్ట్రంలో జగన్ రెడ్డి చీకటి పాలన, చీకటి జీవోలు, చీకటి రాజ్యం.. వీధిలో మాడిపోయిన బల్బు మార్చే దిక్కేలేదు.. రాష్ట్ర భవిష్యత్ అంధకార బంధురం చేసిన పాపం జగన్ రెడ్డిదే..
నారా లోకేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అప్పట్లో రూ 2,658కోట్లతో 22,283కిమీ గ్రామీణ బీటి రోడ్ల నిర్మాణం..రూ 718కోట్లతో 11,253కిమీ గ్రావెల్ రోడ్ల నిర్మాణం..రూ 6వేల కోట్లతో 24,679కిమీ సిమెంట్ రోడ్ల నిర్మాణం..చంద్రబాబు 5ఏళ్ల పాలనలో అద్దాల్లా ఆంధ్రప్రదేశ్ రోడ్లు..జగన్ రెడ్డి సీఎం కాగానే అంతా అధ్వానం..రోడ్లన్నీ గుంతలమయం, నరకప్రాయంగా ఏపి రోడ్లు..గత 4ఏళ్లుగా రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కులేదు..ఏపి రోడ్లను చూసి తెలంగాణ మంత్రుల ఎగతాళి సిగ్గుచేటు..ఒకసారి ఏపి తీసుకెళ్లి అక్కడి రోడ్లపై తిప్పండి, తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో వాళ్లే చెబుతారని తన స్నేహితులే చెప్పారని కేటిఆర్ ఏపిని ఎద్దేవా చేయడం విన్నాం, చూశాం.. అదే చంద్రబాబు సీఎంగా ఉంటే ఇలా ఎగతాళి చేసేవారా..? ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ నలుగురిలో నవ్వులపాలైందా..? రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలి.
నారా లోకేశ్ మంత్రిగా గ్రామాల్లో రూ 1,674కోట్లతో 6,15,809 పంటకుంటలను తవ్వించారు..రూ 2685కోట్లతో చెరువులన్నీ పూడిక తీయించారు..రూ 505కోట్లతో 3,58,918 ఎకరాల్లో ఉద్యానతోటల పెంపకాన్ని ప్రోత్సహించారు..రూ 345కోట్లతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు 9599నెలకొల్పారు..రూ 1174కోట్లతో 10లక్షల పైగా మరుగుదొడ్లు నిర్మించారు. 4950గ్రామ పంచాయతీలు, 5958గ్రామాలను ఓడిఎఫ్(బహిరంగ మలవిసర్జన రహితం)గా చేశారు. పట్టణాలకు ధీటుగా మన పల్లెలను తీర్చిదిద్దిన ఘనత నారా లోకేశ్ దే..
రూ 211కోట్లతో 2,115పంచాయతీ భవనాలు నిర్మించారు..రూ 170కోట్లతో 5,565 అంగన్ వాడీ భవనాలు నిర్మించారు..రూ 8,704కోట్లతో గ్రామాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెంచిన క్రెడిట్ నారా లోకేశ్ దే..అలాంటిది గత 4ఏళ్లలో జగన్ రెడ్డి హయాంలో గ్రామాలన్నీ అధ్వానం చేశారు.. అభివృద్ధిని నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతిపాల్జేసింది జగన్ రెడ్డే..
నరేగాలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను ముందుంచారు..దేశవ్యాప్తంగా 10జిల్లాలు ఎంపికైతే, అందులో 8జిల్లాలు ఏపివే…కేంద్రం నుంచి రూ 26,082కోట్ల ఉపాధి హామీ నిధులు రాబట్టారు, 97.26లక్షల పనిదినాలు కల్పించారు. 40లక్షల పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి 97పైగా అవార్డులు సాధించిన ఘనత నారా లోకేశ్ దే..ఇప్పుడీ 4ఏళ్లలో నరేగాలో ఏపీని అధోగతికి జగన్ రెడ్డి దిగజార్చారు…
నారా లోకేశ్ మంత్రిగా ప్రతి గ్రామంలో పశుగ్రాస క్షేత్రాలు..42, 417 గోకులాలు, మినీ గోకులాలు, పశువుల హాస్టళ్లు నెలకొల్పారు..2.57లక్షల వర్మి కంపోస్ట్ పిట్లు ..రూ 1 కే కిలో పచ్చగడ్డి, రూ 2కే కిలో సైలేజ్, రూ 3కే ఎండుగడ్డి, రూ 4కే కాన్సెంట్రేట్ ఫీడ్ అందించి రూ 250కోట్లతో పశుగ్రాస భద్రత కల్పించారు. అలాంటిది వైసిపి అధికారంలోకి వచ్చాక గత 4ఏళ్లలో తీవ్ర పశుగ్రాస కొరతతో తల్లడిల్లే పరిస్థితి కల్పించారు, పశువుల ఉసురు పోసుకున్న చరిత్ర జగన్ రెడ్డిదే..
నారా లోకేశ్ మంత్రిగా గ్రామీణాభివృద్ధిపై కేంద్రం నుంచి 97అవార్డులు సాధించారు..మొత్తం 671అవార్డుల్లో 97 లోకేశ్ మంత్రిత్వ శాఖకే..‘‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్, స్కాచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులన్నీ లోకేశ్ వే…జగన్ రెడ్డి సిఎంగా ఈ 4ఏళ్లలో ఎన్ని అవార్డులొచ్చాయి..? కేంద్రం నుంచి ఒక్క అవార్డు రాని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్..కేంద్రం ఇవ్వలేదని, నీకు నువ్వే అవార్డులిచ్చుకోవడం సిగ్గుచేటు.
గత 4ఏళ్లలో జగన్ రెడ్డి పాలనలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది..వ్యవసాయ మోటార్లకు మీటర్లు తగిలించి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించారు. కేంద్రం ఇచ్చే రూ 6వేల కోట్ల కోసం కక్కుర్తిపడి జగన్ రైతుల మోటార్లకు మీటర్లు బిగించారని, కేసిఆర్ రైతుల కోసం రూ 6వేల కోట్లు తిప్పికొట్టారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎగతాళి చేయడం జగన్ ప్రభుత్వ నిర్వాకాలకు అద్దం..ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంటే ఏపి 6వ స్థానానికి దిగజారింది.. మద్దతుధర లేక, దళారీలకు అయినకాడికి పంట ఉత్పత్తులను అమ్ముకుని రైతులు అప్పుల్లో మునిగారు. ఒక్కో రైతు నెత్తిన రూ 2,45,554అప్పు మోపారు, జాతీయ స్థాయి కన్నా ఏపిలో 231% ఎక్కువ కావడం గమనార్హం..ఏటేటా 20% రైతు ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరమని ఎన్ సిఆర్ బి నివేదికే వెల్లడించింది. జగన్ సిఎం కాకముందు రైతు ఆత్మహత్యల కన్నా ఇప్పుడు రెట్టింపు ఆత్మహత్యలు జరగడం ఘోర వైఫల్యం..
చేతి వృత్తుల ఉపాధిని గత 4ఏళ్లలో దారుణంగా దెబ్బతీశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీల ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. గ్రామీణ నిరుద్యోగం పెరిగిపోయింది. రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుక, దుల్హన్, పెళ్లి కానుకలు, నిరుద్యోగ భృతి, అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా, విదేశీ విద్య, ఆదరణ, రైతురథాలు వంటి టిడిపి ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. గ్రామీణుల కొనుగోలు శక్తిని దెబ్బతీశారు, పొదుపుశక్తిని అడుగంటేలా చేశారు. కరెంటు ఛార్జీలు 8సార్లు పెంచి రూ 25వేల కోట్ల భారం మోపారు, ఆర్టీసీ ఛార్జీలు, నీటి తీరువా, ఆస్తిపన్ను, చెత్తపన్నులతో బాదుడే బాదుడు..అటు నిత్యావసరాల ధరలు పెరిగి, చుక్కలనంటిన పెట్రోల్ డీజిల్ ధరలతో,ఇటు ప్రభుత్వ పన్నుపోటుతో గ్రామీణ జనజీవనమే దుర్భరమైంది..గ్రామీణ రుణభారం ఏపిలో పెరిగిపోయిందని 78వ జాతీయ నమూనా సర్వే పేర్కొంది. తెలంగాణలో 39.36%మంది రుణాల ఉచ్చులో చిక్కుకుంటే, ఏపిలో 46.33% అప్పుల ఊబిలో కూరుకుపోయారని పేర్కొంది.
మరోవైపు గ్రామీణ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు మంగళం పాడారు. 4ఏళ్ల క్రితం టిడిపి ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప, జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కరోడ్డు వేసిన దాఖలాలేదు. కనీసం రోడ్లపై పడ్డ గుంతలు పూడ్చే పరిస్థితి లేదంటే ఎంత నిర్లక్ష్యమో..? ఏదైనా ఊరెళ్లాలంటేనే రోడ్లపై గుంతలకు భయపడే స్థితి కల్పించారు. చంద్రబాబు హయాంలో కట్టిన వాటర్ ట్యాంకులు, స్కూలు బిల్డింగులు, పంచాయతీ, అంగన్ వాడీ భవనాలకు వైసిపి రంగులేయడం తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. ‘‘జల్ జీవన్’’ పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఈ పథకంలో రాష్ట్రం వాటా రుణం రూ 839కోట్లు దారి మళ్లించారు. ఇంటింటికి కుళాయికి తాళం వేశారు. పూర్తయిన పనులకే రూ 1000కోట్లు పెండింగ్ పెట్టడం శోచనీయం. తాగునీటి పథకాలకే రూ 500కోట్ల బకాయిలు పెట్టారు, వాటర్ ట్యాంకర్ల సరఫరాదారులకే రూ 225కోట్ల బకాయిలు పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట, 5వేల పల్లెల్లో ప్రజలకు గొంతు తడిసే పరిస్థితి కూడా లేకుండా చేశారు..రూ 15వేల కోట్లతో జరగాల్సిన పనులకు బ్రేకులేశారు..కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది. కేంద్రం ఇచ్చిన రూ 8,660కోట్లు మళ్లించారు, 2022-23లో రూ 2022కోట్లు జమచేయలేదంటూ గుంటూరు సదస్సులో సర్పంచులే ధ్వజమెత్తారు..గ్రామాల్లో ప్రజాప్రతినిధులను తోలుబొమ్మలుగా మార్చారు, వారి అధికారాలకు కోతలు పెట్టారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను తోసిరాజని, అదనంగా వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని తెచ్చి స్థానిక స్వపరిపాలన లక్ష్యానికే తూట్లు పొడిచారు. పంచాయతీలకు వేల కోట్ల కరెంటు బిల్లులే కాకుండా వాటిపై సర్ ఛార్జీలు వేసి మరిన్ని భారాలు మోపారు. రూ 2,208కోట్ల బకాయిలపై సర్ ఛార్జీల భారం మరో రూ 1,434కోట్లు వేయడం పంచాయతీలను ఆర్ధికంగా కుంగదీయడమే.. ఏపిలో ఇంకా 2,163 పంచాయతీలకు సొంత భవనాల్లేవని, 3308 పంచాయతీలకు కంప్యూటర్ సౌకర్యం లేదని లోక్ సభలో టిడిపి ఎంపి కేశినేని నాని ప్రశ్నకు కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ జవాబివ్వడం సిగ్గుచేటు..
జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును గాని, ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. టిడిపి హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఏడాదికి రూ 15వేల కోట్లు ఖర్చుచేస్తే వైసిపి ప్రభుత్వం వచ్చాక ఏ ఏడాదీ రూ 4వేల కోట్లు ఖర్చుపెట్టలేదు. అక్కడక్కడ కట్టిన రైతుభరోసా కేంద్రాలు, ‘‘నాడు-నేడు’’ స్కూలు భవనాలు నాసిరకమే..వందల పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి, మొదటి విడత వేసిన రంగులప్పుడే వెలిసిపోయాయి, పాత శ్లాబులకు వేసిన ప్లాస్టరింగ్ పెచ్చులూడి పడి విద్యార్ధులకు గాయాలవ్వడం తెలిసిందే..నాడు-నేడు పనులకు రూ 8వేల కోట్ల కావాల్సివుండగా బడ్జెట్ లో అందులో సగం కూడా కేటాయించలేదు, కేటాయించినదాంట్లో సగం కూడా ఖర్చు పెట్టిన దాఖలాలేదు. రెండో దశ ‘‘నాడు-నేడు’’ పనులు రూ 8వేల కోట్లకు ఇప్పటికిచ్చింది రూ 1500కోట్లే కావడం దీనిపై జగన్ రెడ్డి నిర్లక్ష్యానికి నిలువుటద్దం..చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడంతో ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయాయి.
వైసిపి ఇసుక మాఫియా పేట్రేగిపోయింది..టిడిపి ఉచిత ఇసుక పథకాన్ని రద్దు చేసి, ఇసుక రేట్లు పెంచేయడంతో నిర్మాణ రంగం కుదేలైంది. వైసిపి శాండ్ మాఫియా అరాచకాలతో 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు..అటు చేయడానికి పనిలేక, ఇటు పొట్ట నింపుకునే దారిలేక తాపీ పనివారు, కార్పెంటర్లు, ఎలక్ట్రీసియన్లు, ప్లంబర్లు, చేతి వృత్తుల వారందరి ఉపాధికి గండికొట్టిన చరిత్ర జగన్ రెడ్డిదే..
గత 4ఏళ్ల వైసిపి పాలనలో పనుల్లేక, బతకలేక అనేకమంది వలసబాట పట్టారు, ఊళ్లకు ఊళ్లే వలసబాట పట్టాయి. కర్నూలు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వలసలు పెరిగిపోయాయి.. కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు, చింతకుంట, కోసిగి, జంపాపురం, దుద్ది, అగసనూరు, సాతనూరు, బెళగల్, కోలమాన్ పేట, పెదకడబూరు మండలం కల్లుకుంట, దనిగట్టు, చిన్నకడబూరు, కంబళ్ల దిన్నే, జాలవాడి, మురుకాని, దొడ్డిమేకల, బసలదొడ్డి, ఉలికనిమి, నౌలేకల్లు.. అనంతపురం జిల్లా గుమ్మగట్ల, రాయదుర్గం, ఇరేహాళ్, కల్యాణదుర్గం మండలాల్లో కొన్ని గ్రామాలే అందుకు ఉదాహరణ…ఊళ్లకు ఊళ్లే వలసలు పోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం..
ఒకప్పుడు కళకళలాడిన గ్రామాలిలా వెలవెలా పోవడానికి జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలే కారణం..పల్లెల్లో రైతులు, చేతివృత్తులెంత సుభిక్షంగా ఉన్నాయనేదానిపైనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. గ్రామీణుల కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బతీశారు, పొదుపు శక్తి పూర్తిగా పతనమైంది. ‘‘పల్లె కన్నీరు పెడుతోంది’’. గ్రామీణ ప్రజానీకం తల్లడిల్లుతోంది.. ఈ సంక్షోభాన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ పల్లెలు మళ్లీ సుసంపన్నం కావాలన్నా, గ్రామీణ రైతాంగం, చేతివృత్తులవారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పూర్తిస్థాయిలో ఏర్పడాలన్నా 20ఏళ్ల ముందుచూపు, సమర్ధ నాయకత్వం ద్వారానే సాధ్యం.