డేంజర్, అష్టాచమ్మా, అనంతపురం 1980, త్రిపుర, కలవరమాయే మదిలో, గోల్కండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ.. తదితర చిత్రాల్లో నటించి మెప్పించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది కలర్స్ స్వాతి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. 2018లో పైలట్ వికాస్ వాసును పెళ్లి చేసుకున్న స్వాతి.. ఆ తర్వాత తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయింది. అయితే.. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక సినిమాల్లో నటించదేమో అనుకున్నారంతా. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
ఇప్పుడు కలర్స్ స్వాతి ఒప్పుకున్న చిత్రం పంచతంత్రం. డెబ్యూ డైరెక్టర్ హర్ష పులిపాక తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్వాతితో పాటు బ్రహ్మానందం, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ఇతర పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేస్తుందట. అయితే.. ఇప్పుడు ఆమెకి సినిమాలు అవసరం. ఖాళీగా ఉండడం బోర్ కొడుతోందట. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ క్యారెక్టర్ అయినా సరే చేస్తానంటోంది. ఇప్పుడు ఆమె తన మకాంని పూర్తిగా హైదరాబాద్ కి మార్చింది. సోషల్ మీడియాలో యాక్టివిటీ తగ్గించింది. కెరీర్ చక్కదిద్దుకోవడం ఆమె తొలి ప్రాధాన్యం.
అయితే.. వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు జరిగాయని.. అందుకే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తన జీవితంలో జరిగిన మార్పుల గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడదట. సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను అంటోందని వార్తలు వచ్చాయి. మరి.. ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటుందేమో చూడాలి.











