ముందస్తుకి వెళ్లాలనే ప్లాన్లో ఉన్నాడు జగన్.. ఇటు ఆర్ధికసమస్యలు, అటు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత… ఈ రెండింటితో ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు జగన్.. దానికోసమే ఆయన ఢిల్లీ టూర్ అని ప్రచారం జరుగుతోంది. మరి, మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?. ఇవ్వడా?? ఇస్తే వైసీపీ – బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ అనే అభిప్రాయం, ఇవ్వకపోతే… జగన్కి మైనస్..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ఢిల్లీ వెళ్లనున్న జగన్.. 6వ తేదీన కూడా అక్కడే బస చేయనున్నారు. ముందుగా ప్రధాని మోదీతో జగన్ చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ మేరకు జగన్ ఢిల్లీ టూర్ లో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈసారి ఢిల్లీ పర్యటనలో జగన్ తో ముఖ్యమైన బిల్లులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
జూలై 5వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం జగన్. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై జగన్ మరోసారి ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారు. విభజన హామీల అమలుకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
అలాగే రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై సీఎం జగన్ మద్దతును ప్రధాని మోదీ కోరనున్నారు. ఢిల్లీలో పాలనకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై బిల్లుతో పాటు ఉమ్మడి పౌరసత్వానికి సంబంధించిన బిల్లు మరియు ఇతర బిల్లులు ఇందులో ఉన్నాయి. పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ సాయం కేంద్రానికి తప్పనిసరి కానుంది. ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ మద్దతును ప్రధాని అడిగే అవకాశం ఉంది.
అయితే సీఎం జగన్ ప్రతిపాదనలకు పీఎం నరేంద్ర మోడీ ఒప్పుకోకపోతే జరిగే పరిణామాలు వైసీపీకి అగమ్యగోచరంగా మారుతాయి, రాజకీయ పరిణామాల దృశ్య ఇపుడు వైసీపీ కి బీజేపీ సపోర్ట్ చేసేంత సాహసం చేయకపోవచ్చు, వైసీపీకి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇలాంటి సమయంలో వైసీపీ కి సపోర్ట్ ప్రకటిస్తే అది బీజేపీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉన్నటు బీజేపీ నాయకుల అభిప్రాయం. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని గ్రహించిన జగన్ బీజేపీ సపోర్ట్ కూడగట్టుకోవడం కోసమే ఢిల్లీ పయనం అయిన్నట్టు తెలుస్తోంది..