ఏపీలో జగన్ రెడ్డి సీఎంగా పాలన పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి కడపలో అమలయ్యే రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రం మొత్తం ప్రయోగిస్తున్నారు అన్నది అక్షర సత్యం.
పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఆ పార్టీ పేరు చెబితే చాలు.. సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. అధినేత తుగ్లక్ రెడ్డికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో.. అంతే దగ్గరగా కేడర్ కూడా రాష్ట్రంలో రాక్షస పాలనకు తెర తీస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై దాడులు, కేసులు పెట్టి హింసకు గురిచేస్తున్నారు. చివరకు మీడియా ప్రతినిధులపై కూడా దాడులకు వెనకాడడం లేదు.
జిల్లాలోని గురజాల నియోజకవర్గ కేంద్రంలో గ్రామ దేవత శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఏటా కోర్ల పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా జరుపుతుంటారు. అమ్మవారి ఉత్సవాలు నేపధ్యంలో గురజాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గానికి చెందిన నాయకులు ప్రభను ఏర్పాటు చేసి.., మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కారంపూడి రోడ్డులో వైసీపీ నేతలు ఆధ్వర్యంలో మరో మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో అమ్మవారి తిరునాళ్ళకు విచ్చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రజలకు స్వాగతం పలుకుతూ.. ఇరు పార్టీలకు సంబంధించిన లోకల్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలను వైసీపీ మూకలు చింపివేశాయి. అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తరువాత రాత్రికి ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభల వద్ద గొడవ మొదలైంది. దీంతో వైసీపీ రౌడీ మూకలు దాదాపు 200 మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని దళిత నేతలు ఏర్పాటు చేసిన ప్రభపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న టీడీపీ నేతలను కర్రలతో కొట్టారు. రాళ్లు రువ్వి.., భయానక వాతావరణం సృష్టించారు. దీంతో అమ్మవారి తిరునాళ్ళకు విచ్చేసిన భక్తులు.., చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
ఈ నేపధ్యంలో ఘర్షణ ఘటనను చిత్రీకరిస్తున్న గురజాల మీడియా ప్రతినిధులపై సైతం వైసీపీ రౌడీ మూకలు దాడులకు తెగపడ్డారు. చొక్కా పట్టుకుని కర్రలతో కొట్టారు. సెల్ ఫోన్లు లాక్కొని భయభ్రాంతులకు గురిచేశారు. మరోవైపు ప్రతిఘటించిన తెలుగుదేశం పార్టీ దళిత నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి.., రాత్రంతా స్టేషన్లో కూర్చొపెట్టారు. పక్కా ప్లాన్ తో దాడికి తెగపడుతున్న వందలాది మంది వైసీపీ రౌడీ మూకలను పోలీసులు నిలవరించలేక చేతులెత్తేశారు. అత్యంత సెన్నిటీవ్ ప్రాంతమైన గురజాలలో అది తిరునాళ్ళ జరుగుతున్న క్రమంలో వందల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి కూడా ఏం చేయలేని నిస్సహా పరిస్ధితి చూస్తూ ఉండిపోవడం విమర్శలకు దారితీస్తోంది. అంత పెద్ద తిరునాళ్ళ జరుగుతున్న నేపధ్యంలో అల్లర్లు జరుగుతాయని తెలిసి కూడా.. ఇంటెలిజెన్సీ వ్యవస్ధ నిద్రపోవడం చర్చకు దారితీస్తోంది. కనీసం వైసీపీ రౌడీ మూకల దాడుల్లో మీడియా చిక్కుకుంటే వారి అడ్డుకుని.., కంట్రోల్ చేయడంలో స్థానిక పోలీసులు తటపటాయించడం పట్ల జర్నలిస్టు సంఘాలు ఆక్రోసిస్తున్నాయి. గురజాల మండలం వైసీపీ ప్రధాన నాయకుడిగా చెప్పుకునే ఓ నేత స్వయంగా రంగంలోకి దిగి.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై దాడికి పురికొల్పినట్లు తెలుస్తోంది.
అలానే మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ రౌడీ మూకలు గురజాల జాతరకు తరలించి.., టీడీపీ నాయకులను టార్గెట్ చేసి.., దాడులకు కుట్రలు పన్నినట్లు సమాచారం. అలానే ఈ దాడుల్లో మీడియా వాళ్ళను కూడా టార్గెట్ చేసి దాడికి యత్నించడం ప్లాన్ లో భాగమేనని తెలుస్తోంది. ఇలా గురజాల అమ్మవారి జాతరలో వైసీపీ నీచరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. అలానే పోయిన వారం మాచర్ల ఆంధ్రజ్యోతి ఫ్రింట్ మీడియా జర్నలిస్ట్ విష్ణు పై వైసీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు. రోడ్డుపై చొక్కా పట్టుకుని.., సెల్ ఫోన్ లాక్కోని ఎమ్మెల్యే పీఆర్కే వర్గీయులు దాడికి తెగపడ్డారు. చంపేందుకు ప్రయత్నిస్తున్నా.. అక్కడున్న పోలీసులు చోధ్యం చూశారు. మాచర్లల్లో రౌడీ రాజకీయం జడలు విప్పిందనే చెప్పాలి. ఇలా వైసీపీ రౌడీ మూకలు.., ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గీయులు గురజాల జాతరలో కూడా అల్లర్లు సృష్టించి భయానక వాతావరణాన్ని పరిచయం చేశారని పలువురు ఆరోపింస్తున్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. దీనిపై గురజాల డీఎస్పీ స్పందించకపోవడం గమనార్హం. అలానే గురజాల వైసీపీ దౌర్జన్యకాండపై ఇప్పటికీ ఎటువంటి కేసు నమోదు కాలేదు అన్నది వాస్తవం.