టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సొంత ఎంపీ షాక్ ఇచ్చారు.. భూమన ఆడుతున్న నాటకాలని ఆయన మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు.. ఎస్వీ గోశాలలో గోవులు అనుమానస్పద రీతిలో మరణిస్తున్నాయని రాజకీయం షురూ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.. దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు గోశాలను సందర్శించి నిరూపించవచ్చని ప్రభుత్వం ఆహ్వానించింది.. ప్రభుత్వం తరఫున ఓపెన్ సవాల్ ఎదురు కావడంతో భూమన షాక్ అయ్యారు.. టీడీపీ ఎమ్ఎల్ఏలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరవణి శ్రీనివాసులు స్వయంగా ఫోన్ చేసి మరీ భూమనని గోశాల సందర్శనకు రావాలని ఆహ్వానాలు అందించారు..
టీడీపీ ఎమ్ఎల్ఏలు ఫోన్ చేసినా .. భూమన తన మార్క్ నాటకీయతను ప్రదర్శించారు.. తనను హౌజ్ అరెస్ట్ చేశారని, గడప దాటనీయడం లేదని వైసీపీ మీడియా ముందు హడావిడి చేయబోయారు.. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీకి చెందిన ఎంపీ గురుమూర్తి గోశాల సందర్శనకి విచ్చేశారు.. గోశాలలోని గోవుల స్థితి గతులను పరిశీలించేందుకు ఆయన ఆసక్తి ప్రదర్శించారు.. ఆయనకు టీడీపీ నేతలు సాదర స్వాగతం పలికారు..
భూమనకి తెలియకుండా ఎంపీ గురుమూర్తి గోశాల సందర్శనకు విచ్చేయడంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. గురుమూర్తిపై భూమన భగ్గుమన్నారని తెలుస్తోంది.. తాను హౌజ్ అరెస్ట్ డ్రామాతో బిజీ ఉండగా, ఎంపీ తనని పిచ్చివాడిని చేయడం ఎంతవరకు సబబని నిలదీశారని సమాచారం.. మరోవైపు, భూమన తనయుడు అభినయరెడ్డి ఓవర్ యాక్షన్ చేశాడు.. పోలీసులతో భూమన అభినయరెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు..
మరోవైపు, గోశాల ఘటనని సమిష్టిగా ప్రజల ముందుకు తీసుకుపోవాలని వైసీపీ అధినేత జగన్.. పార్టీ నేతలకు సూచించారు.. తమపై పడిన హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాడు జగన్.. అందుకే, ఈ అంశాన్ని బలంగా తీసుకుపోవాలని స్కెచ్లు వేసింది వైసీపీ హై కమాండ్.. కానీ, స్థానిక ఎంపీ గురుమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన మధ్య సమన్వయం లేకపోవడం తమను డ్యామేజ్ చేసిందని అధిష్టానానికి రిపోర్టులు అందాయని తెలుస్తోంది… దీనిపై జగన్ సీరియస్ అయ్యారని సమాచారం.. మరి, దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..