విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖ మేయర్ పదవి ఇస్తామని చెప్పడం వల్లే తాను పోటీచేసి కార్పొరేటర్గా నెగ్గానని ఆయన చెప్పారు. ఇప్పుడు కావాలనే పార్టీలో కొందరు తనకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం చేసిన వారు ఎవరూ బాగుపడలేదని వంశీ బాధతో చెప్పారు. పార్టీ తనకు ఏనాడూ అన్యాయం చేయలేదని, అయితే కొన్ని శక్తులు తనకు మేయర్ పదవి రాకుండా అడ్డుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
అందుకే పోటీ చేశా..
విశాఖ మేయర్ పదవి ఆఫర్ చేయడం వల్లే తాను కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశానని శ్రీనివాస్ వెల్లడించారు. నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని మీడియాకు తెలిపారు. జరుగుతున్న పరిణామాలను సీఎంకు వివరిస్తానని ఆయన తెలిపారు. మేయర్గా మహిళకు అవకావం కల్పించాలని పార్టీ భావించి ఉండవచ్చని, పార్టీ తనకు ఏ నాడూ అన్యాయం చేయలేదని, కానీ తనకు పదవి రాకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని వంశీకృష్ణ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
Must Read ;- మంత్రి బొత్స VS ఎమ్మెల్యే కోలగట్ల.. విజయనగరం మేయర్ పీఠానికి ఫైట్











