అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీ ఛైర్మన్ కావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు హెల్ప్ చేశారని జేసీ చెప్పుకొచ్చారు. జగన్ తలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ అయ్యేవాడిని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్రెడ్డి, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణను త్వరలో కలుస్తానని జేసీ ప్రకటించారు. వైసీపీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కూడా తాడిపత్రి అభివృద్ధికి సహకరించాలని లేఖలు రాస్తానన్నారు.
తొలగిపోయిన టెన్షన్
తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా పూర్తి కావడంతో టెన్షన్ తొలగిపోయింది. ఫలితాలు వచ్చినప్పటి నుంచీ కౌన్సిలర్లు చేజారకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లకు తోడు సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మద్దతు పలకడంతో జేసీ ప్రభాకర్రెడ్డికి మెజారిటీ లభించింది. తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. తాడిపత్రి అభివృద్ధికి భేషజాలు పక్కనపెట్టి పనిచేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
Must Read ;- తాడిపత్రిపై వైసీపీ దృష్టి.. పట్టు సడలనీయని జేసీ ప్రభాకర్రెడ్డి











