January 17, 2026 2:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులుగా జగన్ ముఠా !

May 5, 2025 at 7:39 PM
in Andhra Pradesh, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నేడు రాష్ట్రంలో నిజం నిందలు మోస్తున్నది. అబద్ధం అందలమెక్కి ఊరేగుతున్నది. మోసం, ద్వేషం, అబద్దాలు ప్రజల మెదళ్లలోకి చొప్పిస్తున్నారు. ఆధిపత్యం కొరకు అజ్ఞానపూరితంగా వ్యవహరిస్తు రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెడుతున్నారు. విశ్వాసం విద్వేషంగా మారి విద్వంసానికి పూనుకొంటున్నారు..అబద్ధాల పునాదుల మీద మిథ్యా చరిత్రని నిర్మించే స్వార్ధ రాజకీయాలు సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. తిరోగమన రాజకీయ శక్తుల మూలంగా రాష్ట్రం దయనీయ స్థితికి నెట్టబడుతుంది. ప్రజలు చైతన్యం వంతమయి తిరోగమన రాజకీయ శక్తుల్ని తొక్కుకుంటూ పురోగమించాల్సిన సమయం ఇది. కొందరికి అభిమానం ఎవరిపైనైనా ఉండొచ్చు. కానీ నిజాలు తెలుసుకొండి. రాష్ట్రం మేలుకోరి ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవ ప్రపంచాన్ని చూడండి. కొందరి గోముఖ వ్యాఘ్రాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇదేమి దరిద్రమో ఇంకా అమరావతి మీద పడి ఏడుస్తున్నారు. దేశంలో ఏపీ లో తప్ప ఏ రాష్ట్రం లో కూడా సొంత రాజధాని నిర్మాణం మీద ఏడ్చే ప్రతిపక్షం,మీడియా కానీ, పనికి మాలిన దరిద్రపు మేధావులు కానీ ఉండరేమో. కావునా వాస్తవ పరిస్థితులను ప్రజలకి వివరించి, ఇలాంటి తప్పుడు విష ప్రచారాలను బలంగా తిప్పికొట్టాల్సి వుంది.మొన్న జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఓటమి చెంది కన్నులు పొడుచుకున్నా భవిష్యత్తు కనిపించని రాజకీయ గాఢాంధకారంలో చిక్కుకున్న జగన్ రెడ్డి ముఠా ఏ అబద్దం అన్నా రక్షించలేక పోతుందా అన్న ఆశతో మళ్ళి అబద్దాలతోనే ప్రజలను మోసం చేయగలనన్న భ్రమల్లో ఉన్నారు. కానీ అబద్దాలతో ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆదరిస్తారు అనుకోవడం అత్యాశ అవుతుంది.

దిక్కుమాలిన సా*క్షి మీడియా అమరావతి మీద విషం కక్కటంలో అర్ధం వుంది. కానీ కొందరు దిక్కు మాలిన మేధావులు కూడావిషం కక్కుతున్నారు.రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూ దందా చేస్తోందని. రూ.లక్షల కోట్ల అప్పులతో రాజధాని నిర్మాణం చేపట్టి, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని, రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మార్చేసిందని, ఒక ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేస్తోందని, రాష్ట్రం లోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కొన్ని కట్టడాలు చేపట్టాక పునఃప్రారంభం అనడం హాస్యాస్పదం అని, అమరావతిలో, విశాఖలో విలువైన భూములను అస్మదీయ కంపెనీలకు కట్టబెడుతున్నారని, అమరావతి నిర్మాణం రాష్ట్రానికి గుదిబండగా మారిందని,చంద్రబాబు నిర్ణయంలో సామాజిక సమగ్రత, ఆర్ధిక నైతికత లేవని, మునిగిపోయే ప్రాంతంలో రూ.వేల కోట్ల ప్రజాధనం తెచ్చి గుమ్మరించడం భావ్యం కాదని, రాజధాని భూ సమీకరణ వెనుక భారీ కుంభకోణానికి పాల్పడ్డారని,సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారని కొందరు పనికి మాలిన మేధావులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సొంత మీడియా సా*క్షి లో అమరావతిపై నీచమైన, అసత్యాలతో కూడిన ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు విషం కక్కుతారో అర్ధం కావడం లేదు. కొందరు పనికి మాలిన మేధావులు అమరావతి మీద అవగాహన లేక మాట్లాడుతున్నారో లేక,అల్పబుద్దితో మాట్లాడుతున్నారో?ఉద్దేశ పూర్వకంగా విషం చిమ్ము తున్నారో అర్ధం కావడం లేదు. కొందరు కిరాయి మేధావులు,వైసిపి నాయకులు అమరావతి పై అసంబద్ద మైన వాగుడు వాగుతున్నారు. ఒక పక్కన11 ఏళ్లుగా రాజధాని లేకుండా పడి వున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకొంటుంటే చూడలేని కబోదులు, అమరావతి రాజధానిపై విషం కక్కడం మాత్రం మానడం లేదు. ప్రభుత్వం పైకి తన రాజకీయ ప్రయోజనం కోసం కిరాయి మేధావులను ఉసి కోల్పుతున్నారు. అమరావతి పై నిస్సిగ్గుగా కిరాయి మేధావులు తమ వాదనలను వండివారుస్తున్నారు ,ఇలాంటి వారి వల్ల రాష్ట్రానికి చేటు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. బాడుగ మేధావులు మిడిమిడి జ్ఞానంతో జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనం కల్పించడానికి భజనలు చేస్తు అమరావతి పై విషం కక్కుతున్నారు. కేవలం స్వార్ధ బుద్ధితో ఒక రాజకీయ పార్టీకి మేలు చెయ్యడానికి అబద్ధాలను నిజాలుగా, చెడును మంచిగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారిలో నైతిక విలువలు, ఆలోచనలు అడుగంటి పోయ్యాయి. ఉగ్రవాదులు వల్ల వచ్చే ప్రమాదం కన్నా, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తు మరొక రాజకీయ పార్టీకి మేలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ కిరాయి మేధావుల వల్లనే అతి పెద్ద ప్రమాదం పొంచి వున్నదని చెప్పక తప్పదు. ఇటువంటి కొందరు స్వార్ధ మేధావులు ప్రవచించే నీతులు కింద నిజం కప్పబడి ఉందని ప్రజలు గుర్తించాలి.

అట్లాగే ముఖ్యమంత్రి, ప్రధాని ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్ వ్యాల్యూ పెంచే ప్రయత్నం చేశారని, ఈ షో జరగడానికి ముందు నుంచే అమరావతి ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడ్డారని, అప్పిచ్చు వాడి కోసం డప్పు కొట్టారని, ప్రపంచబ్యాంకు, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారని, ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను పెంచేశారని,అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానంతో రైతు పండించిన పంటలకు మార్కెట్లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి అంటూ ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట? జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరావతి స్థానం సంపాదించుకుంది అంటూ మరొక పనికి మాలిన మేధావి సా*క్షిలో వ్యాసం రాసాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను,రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, దోచుకోని నేడు అధికారంలో లేనప్పుడు దయామయులుగా నటిస్తూ అబద్దాలతో వ్యాసాలు రాయడానికి సిగ్గు అనిపించడం లేదా? రాష్ట్రం నాశనం కావడానికి కీలకపాత్ర పోషించిన జగన్ ముఠా జనం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పై నోటికి వచ్చిన ఆరోపణలు చెయ్యడం చూసి జనం చ్చీ కొడుతున్నారు.రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులుగా వ్యవహరిస్తూ ప్రాంతాల మధ్య విషం పోసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు.అసత్యాలు, అర్ధసత్యాలు, అభoడాలు వెయ్యడం, లేని దురుద్దేశాలు అంటగట్టడం, కులాల మధ్య,ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం,ప్రతిపక్షంలో వున్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ముఠా అమలు చేసింది ఇదే. దీనికోసం మేధావులు, తటస్థులు, మాజీ అధికారులు, సామాజిక వేత్తలను పోగేసి 2014-19 మధ్య కూడా తెలుగుదేశం ప్రభుత్వం పై ఇదే విధంగా విషం కక్కించారు. ఇప్పుడు అదే పద్దతిలో మళ్ళీ అబద్దాలతో విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరు పై విషం చిమ్మేందుకు తెరవెనుక మంత్రాo మొదలుపెట్టారు. జగన్‌ హయాంలో అడ్డగోలుగా లబ్ది పొందిన కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర అధికారులు విష బృందంలో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.

గతంలో కమ్యునిస్టులు దృడమైన వైఖరితో విలక్షణ పాత్ర పోషించే వారు. నేడు వారి స్వార్ధ పూరిత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కి శాపంగా మారాయి.మంచి చేస్తున్న వారిని కూడా విమర్శించడం కమ్యూనిష్టులు నైజంగా మారింది. వారి కపట నాటకాలు ప్రజలు గమనించే వారిని ఎక్కడ వుంచాలో అక్కడే ఉంచుతున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేసినా నోరు మెదపలేదు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో ప్రజలకు నష్టం జరుగుతున్నట్లు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు.వారికి రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందితే కమ్యూనిస్టులు వెనక నడిచేవారు,వారి జెండా పట్టేవారు ఉండరని వారి భయం.అందుకే వారు అభివృద్ధి నిరోధకులుగా మారారు.గతంలో వామప క్షాలు మాత్రమే నిజాలు చెబుతారనే నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు అందరికన్నా వారే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు.ఏది ఏమైనా రాజకీయాన్ని వ్యాపారమయం చేసి,దగాకోరు విధానాలతో ప్యాక్షనిజం,రౌడీయిజాలతో ధనార్జనే ధ్యేయంగా రాష్ట్రాన్ని,రైతులను గాలికి వదిలేసిన చరిత్ర జగన్ రెడ్డి దే. వెనుకబడ్డ రాయలసీమలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చి రాయల సీమ అభివృద్ది కే పెద్ద పీట వేసింది.ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతూ కూడా రాయల సీమలో పారిశ్రామికాభివృద్దికి విశేష కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. నాడు వలసలకు నిలయం అయిన అనంతపురం జిల్లా నేడు కొలువులకు నిలయంగా మారింది చంద్రబాబు కృషితో. నిత్యం కరువు జిల్లాగా పేరొందిన జిల్లా కార్ల ఖిల్లాగా మారింది..చంద్రబాబు ఏర్పాటు చేసిన కియా కార్ల కంపెనీతో ఏపీ బ్రాoడ్ మార్మోగింది. మరి అయిదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు అయిందా?రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అయిదేళ్లలో రూ 12 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు తప్ప రాయల సీమ వాసిగా రాయలసీమను,రైతాంగాన్ని ఉద్ధరించింది ఏమిటో ఈ కిరాయి మేధావులు చెప్పాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు జలకధలు వినిపించి రాయల సీమ రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత వున్నసాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసి రాయల సీమ ద్రోహిగా మిగిలి పొయ్యారు. ఇప్పటికైనా కిరాయి మేధావులు అమరావతిపై విషం కక్కడం మానండి. రాష్ట్ర ద్రోహులుగా మిగిలి పోకండి.

Tags: #AmaravatiAmaravati news todayaplatest newsappoliticsleonewsleotopycpys jagan
Previous Post

నిన్న కమ్మ.. నేడు బ్రాహ్మణ్‌.. ఏపీలో వైసీపీ కొత్త కుట్ర..!

Next Post

2026 జనవరిలో క్వాంటమ్‌ వ్యాలీగా అమరావతి .. ఏపీ రాజధానికి మహర్దశ..!

Related Posts

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

by లియో డెస్క్
January 17, 2026 12:09 pm

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ...

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

by లియో డెస్క్
January 16, 2026 8:31 pm

2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా...

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

by లియో డెస్క్
January 16, 2026 6:21 pm

ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు...

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

by లియో డెస్క్
January 16, 2026 12:53 pm

కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా...

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

Stunning Hot beauty Jinal Joshi latest stills

ముఖ్య కథనాలు

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist