ఏపీలో వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. కుల, మత వర్గ విబేధాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్టుపై బ్రాహ్మణులను రెచ్చగొడుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ను అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా PSRను ఉండవల్లి అరుణ్ కుమార్ కలవడం చర్చనీయాంశమైంది.
ఉండవల్లికి .. పీఎస్ఆర్కు ఎలాంటి సంబందం లేదు. ములాఖత్లో కావాల్సిన అవసరం లేదు. కానీ ఈ ములాఖత్ వెనుక వైసీపీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాడుకుని వదిలేశారని, జైలుకెళ్తే కనీసం సంఘిభావం ఎవర్నీ పంపలేదని విమర్శలు రాకుండా, ఉండవల్లిని పంపించారని తెలుస్తోంది. ముంబై నటి కాదంబరి జెత్వాని, ఆమె తల్లిదండ్రులను నిర్బంధించిన కేసులో PSR రామాంజనేయులు అరెస్టయ్యారు. ఐకే ఈ కేసులో తనకేమి తెలియదని, అంతా కాంతి రాణా, విశాన్ గున్నీనే చేశారని PSR చెప్తున్నారు.
కానీ, కాదంబరి జెత్వాని ఇష్యూ అంతా PSR కనుసన్నల్లోనే జరిగిందని విచారణలో తేలింది. ఐతే ఈ కేసులో నిజాలు బయటపెడితే వైసీపీ హైకమాండ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి సీఎం జగన్ ఆదేశాలతో సజ్జల ద్వారా ఈ వ్యవహారమంతా జరిగిందన్న విషయం బయటపడుతుంది. అందుకే ఈ విషయాలేవి బయటకు రాకుండా ఉండవల్లి ద్వారా వైసీపీ పెద్దలు చక్రం తిప్పుతున్నారని చర్చ జరుగుతోంది. అంతేకాదు తమ సామాజికవర్గానికి చెందిన PSRను కక్షపూరితంగా అరెస్టు చేశారన్న భావనను బ్రాహ్మణుల్లో కలగజేయడం ద్వారా లబ్ధి పొందాలని వైసీపీ భావిస్తోంది.