విశాఖ స్టీల్ ప్లాంట్ లోని భద్రతా ప్రమాణాల వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. తగిన నిర్వహణ లేక తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నా యాజమాన్యం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
తాజాగా శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో ఎస్ఎంఎస్ 2 లో ప్రమాదం సంభవించింది. ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్స్ .. మరో ఇద్దరు ఉద్యోగులు ప్రమాదంలో గాయపడ్డారు. ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, మరొక కాంట్రాక్టు ఉద్యోగికి తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లాడిల్ హు క్ తెగిపోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన ఉక్కుద్రావణం నేల పాలయింది. ఫైర్ సేఫ్టీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ తరహా ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ లో తరచూ జరుగుతూ ఉండడంతో ఉద్యోగుల్లో ఆందోళన తప్పడం లేదు.
Also Read: విశాఖ విమానాశ్రయానికి ఎసరు!
steel