దేశంలో జోరుగా టీకాలు అందిస్తోంది ప్రభుత్వం. అంతేకాదు.. రికవరీ రేటు 97 శాతం పైనే ఉండడంతోపాటు.. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు రికార్డు స్థాయిలో తగ్గుతున్నాయి.
జోరుగా వ్యాక్సినేషన్..
భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,10,604 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో.. ఇప్పటివరకు మొత్తం టీకా తీసుకున్న వారి సంఖ్య 44,49,552కి చేరింది. కేవలం 19 రోజుల్లోనే ఇంత భారీ సంఖ్యలో టీకాలు అందించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికరాక ప్రకటన విడుదల చేసింది.
తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు..
దేశంలో కరోనా రోజువారీ కేసులు 10-12 వేల మధ్య స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రికవరీలు అధికంగా నమోదవుతున్నాయి. గత మూడు మాసాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజాగా బుధవారం దేశవ్యాప్తంగా 12,899 కొత్త కేసులు నమొదుకాగా.. 17,824 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 1,07.90,183కి చేరింది. అందులో.. 1.04 కోట్ల మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 107 మంది కొవిడ్ తో మృత్యువాత పడగా.. ఈ సంఖ్య 1,54,703కి చేరింది. దీంతో.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మరింత దిగువకు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,55,025కి పడిపోయింది. ఇది మొత్తం కేసుల్లో 1.44 శాతం మాత్రమే కావడం గమనార్హం. రికవరీ రేటు 97.13 శాతానికి పెరిగింది.
Must Read ;- ఎప్పుడు, ఎలా.. వ్యాక్సినేషన్ అందరికీ సాధ్యమా