ప్రశ్నించేవారిపై ఫేక్ కేసులు బనాయించాలని ఫేక్ సీఎం ఒత్తిడి చేస్తే, ఉన్నత చదువులు చదివి రాజ్యాంగం,చట్టం,రూల్ ఆఫ్ లా తెలిసిన పోలీసుల బుద్ధి ఏమైంది? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేసి న్యాయస్థానాల్లో దోషులుగా నిలవడానికి పోలీసులకు సిగ్గు అనిపించకపోవడం విచారకరం అని తెలిపారు. కోవిడ్ గైడ్లైన్స్ పాటించిన సంగం డెయిరీ డైరెక్టర్ల పై తప్పుడు కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. గైడ్లైన్స్ ప్రకారం కేసు పెట్టాల్సి వస్తే, ప్రతీరోజూ మాస్కు వేసుకోకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోన్న మూర్ఖపు ముఖ్యమంత్రిపై రోజుకో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గన్మెన్తో బూట్లు మోయిస్తూ, బహిరంగ సభ నిర్వహించిన గిద్దలూరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Must Read ;- లక్ష్మీ ప్రసన్నపై దాడి చేయటం సిగ్గుచేటు : నారా లోకేశ్
ప్రశ్నించేవారిపై ఫేక్ కేసులు బనాయించాలని ఫేక్ సీఎం ఒత్తిడి చేస్తే,ఉన్నత చదువులు చదివి రాజ్యాంగం,చట్టం,రూల్ ఆఫ్ లా తెలిసిన పోలీసుల బుద్ధి ఏమైంది?అన్యాయమైన కేసులు,అక్రమ అరెస్టులు చేసి న్యాయస్థానాల్లో దోషులుగా నిలవడానికి పోలీసులకు సిగ్గు అనిపించకపోవడం విచారకరం(3/5)
— Lokesh Nara (@naralokesh) June 7, 2021