ఫ్రంట్ లైన్ వారియర్ గా పనిచేస్తోన్న లక్ష్మీ ప్రసన్నపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆస్పత్రిలో విధులు ముగించుకుని, తన ఫ్రెండ్తో కలిసి ఇంటికెళుతుండగా యువతి అని కూడా చూడకుండా పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందో లేదో కానీ, వైసీపీ మార్క్ పులివెందుల పోలీసింగ్తో అరాచకాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఫ్రంట్లైన్ వారియర్స్ పై పోలీసులు విచక్షణారహితంగా విరుచుపడటం ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
Must Read ;- డాక్టర్ రోజి మృతి తీవ్రంగా కలచివేసింది : నారా లోకేశ్
కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్ గా పనిచేస్తోన్న లక్ష్మీప్రసన్న అనే యువతి అపోలో ఆస్పత్రిలో విధులు ముగించుకుని, తన ఫ్రెండ్తో కలిసి ఇంటికెళుతుండగా పోలీసులు యువతి అని కూడా చూడకుండా దాడి చేయడం సిగ్గుచేటు.
— Lokesh Nara (@naralokesh) June 6, 2021