స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న మూడో ఫ్లిక్ ‘పుష్ప’. పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ గా బన్నీ నటిస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందనుంది. నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ కరోనా కారణంగా ఏడు నెలలు ఆగాల్సివచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కు సమయం ఆసన్నమైంది. డిసెంబర్ లో కానీ షూటింగ్ కు వెళ్ళదని నిన్నటి మొన్నటి వరకూ వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ సినిమా నవంబర్ లోనే షూటింగ్ కు రెడీ అవుతోంది.
ఈ ఏడాది అలవైకుంఠపురములో సినిమాతో బ్లా్క్ బస్టర్ ఖాతాలో వేసుకున్న బన్నీ, రంగస్థలంతో సంచలన విజయం కైవసం చేసుకున్న సుక్కూ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి అంచనాలు మామూలుగా లేవు. దీనికి తోడు ‘సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రష్మికా మందణ్ణ ఇందులో కథానాయికగా నటిస్తూండడం ఈ మూవీకి మరింతగా అడ్వాంటేజ్ అయింది. నవంబర్ మొదటి వారంలో కేరళలోని దట్టమైన అరణ్యాల్లో ‘పుష్ప’ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న పుష్ప సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.