ఏపీలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా టీకా త్వరలో అందుబాటులోకి రానుందని, ఫిబ్రవరిలో రెండో డోసు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరిందని హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో ఈ అఫిడవిట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కోవిడ్ టీకా రెండు డోసులు వేయాల్సి ఉన్నందున వైద్య, రెవెన్యూ, పోలీసు సిబ్బంది మొత్తం అవసరం ఉంటుందని కోర్టుకు తెలిపింది. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
Must Read ;– వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే…