తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలపై టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు.విజయసాయి పై ట్విట్టర్ వేదికగా అయ్యన్న ఘాటు విమర్శలు గుప్పించారు.
విజయసాయిరెడ్దిని క్విడ్ప్రోకో జాతిపితగానూ, సూట్కేసు కంపెనీల సృష్టికర్తగా అయ్యన్న అభివర్ణించారు.విజయసాయి తన స్థాయిని మించిన పెద్ద పెద్ద సవాళ్లు విసురుతున్నావంటూ మండిపడ్డారు. కనీసం వార్డుమెంబర్గా కూడా గెలవని నికృష్ణ చరిత్ర నీది అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. `గడ్డం` నెరిసినా సింగిల్-మింగిల్ అంటున్న విజయసాయిలో సరసం మాత్రం ఇంకా పోలేదని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఇక, మీ జాతిరత్నం సింగిల్ గా సింహంలా వచ్చేవాడైతే ఎందుకీ పరదాలు, వలలు, పర్యటించే ప్రాంతంలో 144 సెక్షన్లు, షాపుల మూసివేతలు చెప్పాలంటూ ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా విజయసాయి తన స్థాయిని తెలుసుకుని విమర్శలు చేయాలని అయ్యన్న హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు టిడిపి పైన కానీ, చంద్రబాబు పైన కానీ అనవసరంగా విమర్శలు, అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.