ఏపీలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిని, తెలంగాణలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డిని ఎంచుకోవడంతో.. ప్రతిపక్షాలను టార్గెట్ చేసినట్లుందని.. ఇది కేడర్కి కూడా నెగిటివ్ సంకేతాలు పంపుతోందని భావిస్తున్నారు..
బీజేపీ జాతీయ నాయకత్వం ఆశ్చర్యకరమైన నిర్ణయంతో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించింది.
ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించిన కొన్ని గంటల తర్వాత, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర శాఖ చీఫ్గా పురంధేశ్వరితో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వీర్రాజు స్థానంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని పార్టీ అంతర్గత వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీర్రాజు తరచుగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కనిపిస్తారు, అయితే సత్య కుమార్ బిజెపిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గానికి వ్యతిరేకతకు ప్రసిద్ది చెందారు.
అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం బీజేపీ అమలు చేస్తున్న కొత్త వ్యూహంగా చెప్పుకోవచ్చు ఎందుకంటె చంద్ర బాబు , పురందేశ్వరి ఒకే సామజిక వర్గానికి చెందినవారు, పైగా బంధువులు కూడాను , చంద్రబాబు సామజిక వర్గ ఓట్లు చీల్చడం కోసమే ఈ ఎత్తుగడ అని అర్ధమవుతుంది
తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది, ఏపీలో ఎలా ఒకే సామజిక వర్గాన్ని టార్గెట్ చేసారో తెలంగాణాలో కూడా రెడ్డి సామజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్టు కనపదవుతోంది, అందుకే కిషన్ రెడ్డి కి అధ్యక్షా పదవి కట్టబెట్టినట్లు సమాచారం.బీజేపీ ఇలా వర్గాలను టార్గెట్ చేస్తూ పోతే బీజేపీ గెలవగలడా అని సదరు పార్టీ లీడర్స్ చెవులు కోరుకుంటున్నారు.











