కాజల్ అగర్వాల్ హనీమూన్ ట్రిప్ తెగ ఎంజాయ్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉండగానే ఇటీవల గౌతమ్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి కారణంగా తాను చేస్తున్న చిత్రాల షూటింగులు తిరిగి సెట్స్ పైకి రావాల్సి ఉండటంతో పాటు తనకు చెందిన సన్నివేశాల చిత్రీకరణ కూడా మళ్లీ మొదలు కాకపోవడంతో.. కాజల్ కు మంచి సమయం దొరికింది. దాంతో వృత్తి పరమైన టెన్షన్ పక్కన పెట్టి.. మంచి సమయం మించిపోనీకు అన్న సూత్రాన్ని పాటిస్తూ ఎంచక్కా తన భర్త గౌతమ్ తో కలసి మాల్దీవులకు షికారుకు వెళ్ళింది
Also Read:-కాజల్ వెడ్స్ గౌతమ్ కిచ్లూ
మాల్దీవుల్లోని బీచ్లో ఆనందంగా గడిపేయడమే కాకుండా.. సముద్రంలో తన భర్తతో పాటు ఈత కొడుతూ ఎప్పుడూ లేనంతగా సంతోష క్షణాలను చవిచూస్తోందట. “బ్లూ కలర్లో కనిపించే సముద్రం అన్నా..ఆకాశం అన్నా నాకు చెప్పలేనంత ఇష్టం“ అని అంటోంది. అంతేకాదు రొమాంటిక్ మోడ్లో తామిద్దరం ఈత కొడుతున్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఎంత సంతోషంగా ఉన్నానో వెల్లడించింది.
ఇక కాజల్ చేతిలో మూడు భాషలకు చెందిన అర డజను చిత్రాలున్నాయి. హనీమూన్ ట్రిప్ తర్వాత తాను అంగీకరించిన చిత్రాల షూటింగులలో ఆమె పాల్గొంటుందట. ఇప్పటికే కమలహాసన్ కధానాయకుడిగా రూపొందుతున్న ఇండియన్ 2, మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా తెరకెక్కుతున్న ఆచార్య, బాలీవుడ్లో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ముంబై సగ చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. అలాగే మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్లు, తమిళంలో హే సనామిక చిత్రాలను ఆమె చేస్తోంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇంకో తమిళ చిత్రం పారిస్ పారిస్ విడుదల కావాల్సివుంది.
తన కెరీర్లో మొదట్నుంచి ఎన్నో విజయాలతో పాటు అనేక అపజయాలను చవిచూసిన ఆమె దేనికైనా అతిగా పొంగిపోవడం, అతిగా కుంగిపోవడం తన లక్షణం కాదని ఎప్పుడూ చెబుతుంటుంది. ఆ మధ్య మూడు వరుస హిట్లు, మూడు వరుస ప్లాప్ లు ఆమెకు దక్కాయి. జనతా గ్యారేజ్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు..నేనే మంత్రి వంటి వరుస హిట్ల తర్వాత కవచం, సీత, రణరంగం చిత్రాల అపజయం ఆమెకు ఎదురైంది. అయితే ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాలన్నీ మంచి కథతో కూడుకున్నవని, అందుకు తగ్గ తారాగణం ఆ చిత్రాలకు ఉందని ఆమె చెబుతోంది. తప్పకుండా తాను చేస్తున్న చిత్రాలన్నీ తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడతాయని అంటోంది.
Must Read:-Tollywood-actress-kajal-Aggarwal











