ఏసీపీ కుమార్ గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తెలుగులో ఏం ఇరగదీస్తారో చూడాలి. సునీల్ శెట్టి మొదటిసారిగా తెలుగులో అడుగుపెడుతున్నారు. మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న మోసగాళ్లు సినమాలో సునీల్ శెట్టి పోషిస్తున్న పాత్ర ఇది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైంది. భారత్ లో ప్రారంభమై అమెరికాను వణికించిన అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల కుంభకోణానికి సంబంధించిన కథ ఇది.
ఇందులో కాజల్ అగర్వాల్ విష్ణుకు జోడీగానా కాదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సామ్ సి ఎస్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకేసారి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో దీన్ని నిర్మిస్తున్నారు. (AlsoRead;_-‘మంచు’ నిప్పులు… ఫోకస్ ఎవరిమీద…?











