దక్షిణాది అందాల తార.. తెలుగువారి చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళి.. తను వరించిన ప్రియుడితో జరిగిపోయింది. ముంబైలో బంధుమిత్రుల సమక్షంలో ఆమె కళ్యాణ తంతు పూర్తయింది. ప్రస్తుతం ఆమె పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. తాజ్ ప్యాలెస్ స్టార్ హోటల్ఆమె పెళ్ళికి వేదికైంది. పెళ్ళికళ ఉట్టిపడుతోన్న కాజల్ ఫోటోస్ ను చూసి నెటిజెన్స్ ఆమెకు వివాహశుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రియుడైన ముంబై వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూని పెళ్ళి చేసుకోబోతున్నట్టు సడెన్ గా ప్రకటించి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకూ తన పెళ్ళి గురించి మాటవస్తే .. అబ్బే ఇప్పుడేం పెళ్ళని తోసిపుచ్చిన ఆ సుందరి ఇప్పుడిలా పెళ్ళిపీటలెక్కేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెళ్ళయిన తర్వాత కూడా తను నటిస్తానని తన అభిమానులకు భరోసా నిచ్చింది కాజల్ . ప్రస్తుతం ఆమె చిరంజీవి ఆచార్యలోనూ, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ లోనూ ప్రధానపాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే.