ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రజల్లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసిందనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే గత ఐదేళ్ల కంటే ఈ 100 రోజుల్లో పాలనలో విపరీతమైన మార్పు వచ్చిందనేది ప్రజలు చెబుతున్నారు. పథకాల అమలు మొదలు.. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును సైతం కూటమి సర్కార్ బాగా చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం కలెక్టర్ల ద్వారా.. క్షేత్రస్తాయి అధికారుల ద్వారా చేపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు పూర్తవుతున్న నేపథ్యంలో `ప్రజా ప్రభుత్వం `పై సామాన్యుల టాక్ ఎలా ఉందనేది ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తి కేవలం మేధావులు, విశ్లేషకుల్లోనే కాదు.. కూటమి సర్కారులోనూ ఎక్కువగా కనిపిస్తోంది.
ఎప్పటికప్పుడు తన గ్రాఫ్ను అంచనా వేసుకునే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సామాన్యుల కూటమి ప్రభుత్వంపై ఎంత మేరకు సంతృప్తితో ఉన్నారనే దానిపై దృష్టి పెట్టారు. వంద రోజుల పాలనలో తమ పరిస్థితిపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని కలెక్టర్ల ద్వారా ఆయన రాబడుతున్నారు. కలెక్టర్లు ఇచ్చే నివేదిక ప్రామాణికం కాదని తెలుసు.. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా.. వారు సర్కారుకు అనుకూలంగానే నివేదికలు ఇస్తారు. అయితే.. ఇది ప్రాథమికమేనని.. తర్వాత.. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విషయంలో సర్కారు దూకుడుగా ఉం ది. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ సహా మంత్రి కూడా ప్రజాదర్బార్లు పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నా రు. వీటి పరిష్కారం విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల శాటిస్ఫ్యాక్షన్ను అంచనా వేయనున్నారు. ప్రభుత్వ సేవలు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సేవలు కూడా కలెక్టర్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సేవలకు సంబంధించి ప్రజలు ఎలా ఫీలవుతున్నారన్న విషయాన్ని కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు .. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంశాలపైనే కలెక్టర్లు నివేదిక ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని ప్రకారం ప్రజల నాడిని గుర్తించి.. మరో 100 రోజులకు ప్లాన్ చేసుకునేలా చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక రాజధాని ఏర్పాటు చేయలేకపోయింది… పోలవరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించేసింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. జగన్ విచిత్ర ధోరణి, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులను చూసి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు.
రాష్ట్రంలో ప్రతీ రంగాన్ని ఇంతగా భ్రష్టు పట్టించేయగల ప్రభుత్వం మరొకటి ఉండదని జగన్ 5 ఏళ్ళలో నిరూపించి చూపారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి వడ్డించిన విస్తరి వంటి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని 2019లో అందిస్తే.. జగన్ ఐదేళ్ల పాలన తరువాత రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసి అందించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటిన మొదటి రోజు నుంచే భ్రష్టుపట్టిన వ్యవస్థలలో చీడపురుగులను ఏరేస్తూ మళ్ళీ వ్యవస్థలను గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టులైన అమరావతి, పోలవరం పనులను పునః ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా చేశారు.
జగన్ హయాంలో ఓట్ల కోసమే సకాలంలో పింఛన్లు ఇచ్చేవారు. ఐదేళ్ళపాటు టంచనుగా ఇస్తూనే ఉన్నారు. కానీ నెలంతా పనిచేసిన ఉద్యోగులకు ఏనాడూ సకాలంలో జీతాలు ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడం వలననే జీతాలు, పెన్షన్స్ ఆలస్యం అవుతుండేవని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది కదా? ఈ వంద రోజులలోనే ఒకదాని తర్వాత మరొకటిగా వరదలు ఊళ్ళని ముంచెత్తాయి. బుడమేరు, ఏలేరు గండ్లు పడితే వాటన్నిటినీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూడ్పించింది. సిఎం చంద్రబాబు నాయుడు ఓ పక్క విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలు పర్యవేక్షిస్తూనే అన్ని పనులు సమాంతరంగా చేయించారు.
సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రకాల సమస్యలను, సవాళ్ళను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి బదులు జగన్ ఉండి ఉంటే నేటికీ విజయవాడ నగరం వరద నీటిలో మునిగే ఉండేదని స్థానిక ప్రజలే చెప్పుకుంటున్నారు. ఇన్ని పనులు, ఇన్ని మార్పులు, ఇన్ని విపత్తులు అన్నీ కేవలం వంద రోజులలోనే జరిగాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా జగన్కి, వైసీపి నేతలకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.