ఫ్రెండ్లీ పోలీసింగ్ మరచి ప్రజలను వేధిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్కు లేఖ రాశారు.లాక్ డౌన్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్ అయిన ఓ యువతితో విశాఖ పోలీసులు వ్వవహరించిన తీరును చంద్రబాబు వివరించారు.విశాఖలో దళిత వైద్యుడైన సుధాకర్పై పోలీసులు వ్యవహరించిన తీరును మరవకు ముందే ఒక మెడికల్ షాపులో పనిచేస్తున్న లక్ష్మీఅపర్ణ అనే దళిత యువతిని పోలీసులు వేధించడం అమానుషమని పేర్కొన్నారు.ఈ విధంగా దళితులపై విశాఖ పోలీసులు వ్వవహరిస్తున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొవిడ్ సమయంలో ఫ్రెండ్లీగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రజలను వేధించడం సరికాదని,దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను చంద్రబాబు కోరారు.
Must Read ;- లక్ష్మీ ప్రసన్నపై దాడి చేయటం సిగ్గుచేటు : నారా లోకేశ్