తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా.. ఏమిపట్టనట్టు వ్యవహరించింది. వైసీపీ ప్రభుత్వం ఎంత కప్పిపుచ్చుకున్నా, దొంగ ఓట్ల వ్యవహరం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో వైసీపీ నేతతో దొంగ ఓటర్లను తరలించేందుకు బస్సులు ఏర్పాటు కోసం మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. పక్కా ప్లాన్ తోనే వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లు వేయిందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం బహాటంగా చర్చించుకుంటున్నారు. అధికారం కోసమే వైసీపీ దొంగ ఓట్ల కోసం బరితెగించింది. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించడంతో మళ్లీ ఉప ఎన్నిక జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
Must Read ;- ప్రజాస్వామ్యం ఖూనీ : తిరుపతి ఉప ఎన్నికల్లో పోటెత్తిన దొంగఓటర్లు











