ఆంధ్రజ్యోతి, ఏబీయన్ సంస్థల యం.డీ , జర్నలిస్ట్, సంపాదకులు వేమూరి రాధాకృష్ణ భార్య ఈ రోజు కన్నుమూశారు. ఆవిడ మృతికి పలువురు మీడియా ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి కూడా తన సంతాపాన్ని తెలియచేశారు.
రాధాకృష్ణగారి సతీమణి శ్రీమతి కనకదుర్గ తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని, జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన శ్రీమతి కనకదుర్గ అకాల మరణవార్త తనని తీవ్రంగా కలచివేసిందని, ఈ దుఃఖ సమయంలో ఆ భగవంతుడు మీకు తట్టుకొనే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మీ కుటుంబాన్నంతటికీ తన సంతాపాన్ని తెలియచేస్తున్నానని చిరంజీవి తెలిపారు.
ఇక హీరో, జనసేనాధినేత పవన్ కళ్యాణ్ శ్రీమతి కనకదుర్గ మరణానికి తన సంతాపాన్ని తెలియచేశారు. రాధాకృష్ణ సతీమణి శ్రీమతి కనకదుర్గ తుదిశ్వాస విడిచారని తెలిసి దిగ్ర్భాంతికి లోనయ్యానని, ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకొనే మనోధైర్యాన్ని వారి కుటుంబానికి ఇవ్వాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Must Read ;- కాంగ్రెస్ నేత ఎమ్మెస్సార్ ఇకలేరు