మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటే చిరు, లూసిఫర్ అనే సినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేద్దాం అన్నది చిరు ప్లాన్. దీంతో ఈ సినిమా మీద కూడా చిరు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ సినిమా కథను తెలుగుకు తగిన విధంగా రాయాలి అని దర్శకుడు సుజిత్ కు ఆయన బాధ్యతలు అప్పగించారు అని ఓ టాక్ స్ప్రెడ్ అవుతుంది.
ఈ నేపథ్యంలోనే సుజిత్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా కష్టపడుతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా కథ క్లైమాక్స్ సన్నివేశాలకు సంబంధించిన సిట్టింగ్స్ లో చిరు కూడా సుజిత్ తో కలిసి ఇన్ వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తుంది. అనుకున్న విధంగా తెలుగులో కథను దర్శకుడు సుజిత్ మార్చలేదని చిరంజీవి అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
తెలుగులో వినోదం ఎక్కువగా ఉండాలని అదే విధంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా రాయాలని ఆయన సూచించారుట. మాస్ ని ఆకట్టుకునే విధంగా ఈ కథ రాయలేదు అని కేవలం క్లాస్ ని ఆకట్టుకునే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా కథలో ఉంచాడని, దీనితో చిరంజీవి కాస్త ఆగ్రహం వ్యక్తం చేసి కథను మార్చమని చెప్పారట. త్వరలోనే ఈ కథకు సంబంధించి కొన్ని కీలక అడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
దర్శకులపై అసంతృప్తి కొత్త కాదు
చిరు 150వ చిత్రం వినాయక్ తో చేశారు. ఖైదీ నెంబర్ 150గా అది తెరకెక్కింది. తర్వాత సైరా చిత్రం సురేందర్ రెడ్డితో చేశారు. అది ప్రొడక్షన్ లో ఉన్న సమయంలో ఆయన దర్శకుడి తీరు పట్ల చాలా అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. మధ్యలోనే దర్శకుడిని మార్చాలని యోచించినట్లు కూడా వినిపించింది. రాఘవేంద్రరావును అడిగితే ఆయన నో చెప్పారు. వినాయక్ ను సంప్రదించినా కూడా ఒప్పుకోలేదు. పేరు సురేందర్ రెడ్డి దే ఉంచి.. మరొకరితో దర్శకత్వం చేయించాలని కూడా ప్రయత్నించారు. అందుకు కూడా ఎవరూ ఒప్పుకోకపోవడంతో సురేందర్ రెడ్డితోనే కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు లూసిఫర్ విషయంలో స్క్రిప్టు దశలోనే చిరంజీవి తానే ఎంచుకున్న దర్శకుడి మీద అసంతృప్తికి గురవుతున్నట్లు వినిపిస్తోంది.











