ఏపీలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి P-4 అని పేరు పెట్టింది. P-4 అంటే పబ్లిక్ – ప్రైవేట్ – పీపుల్స్ పార్ట్నర్షిప్. ఉగాది సందర్భంగా కూటమి సర్కార్ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఈ సందర్భంగా పేదరికం లేని సమాజ నిర్మాణమే తన లక్ష్యమని మరోసారి సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ వల్లే P-4 సాధ్యమైందని,2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యాపార లావాదేవీలకే ప్రాధాన్యం ఇచ్చిందని, అయితే తాము పేదలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సినిమాల్లో రెండున్నర గంటల్లోనే సమస్యలన్నీ తీరిపోతాయ్ కానీ నిజ జీవితంలో చంద్రబాబు లాంటి విజనరీ నేత కావాలి అందుకే ఆయనకు మద్దతిస్తున్నాం పీ4 ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
P-4 అంటే డబ్బులిచ్చేయడం కాదని..మార్గదర్శనం చేయడమన్నారు పవన్కల్యాణ్. పీ4 కోసం సర్వేలు, గ్రామసభల ద్వారా 30 లక్షల కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కంపెనీలు కనిపిస్తే వాటాలు రాయించుకుందని…కానీ, తాము మాత్రం పేదలకు అభివృద్ధిలో వాటా కల్పించమని అడుగుతున్నామన్నారు.
చంద్రబాబు సీఎంగా లేకపోతే..P-4 బయటకి వచ్చేదే కాదన్నారు. ఆయన అందరికీ మార్గదర్శకత్వం చేస్తూ.. కష్టా ల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారని, అందుకే 2014 నుంచి చంద్రబాబుకి మద్దతిస్తున్నామని తెలిపారు. P-4ను ప్రభు త్వ కార్యక్రమంగా చేపట్టిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం ముందుకు సాగుతుండగా..సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటోందన్నారు పవన్.