పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పిరియాడిక్ లవ్ స్టోరీ గురించి చిత్ర యూనిట్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు కానీ.. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెబల్ స్టార్ కృష్ణంరాజు మాత్రం రాధేశ్యామ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి పాటలన్నింటినీ చిత్రీకరించడం జరిగిందని చెప్పారు.
త్వరలోనే మిగిలిన టాకీ పార్ట్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక రిలీజ్ గురించి చెబుతూ… ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలియచేశారు. అయితే.. సంక్రాంతికి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ.. ఎలాంటి టీజర్ రిలీజ్ చేయకపోగా.. కనీసం అప్ డేట్ ఎప్పుడు రానుందో కూడా చెప్పలేదు. ఇదిలా ఉటే.. ఈ సినిమా సమ్మర్ రేసు నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇది భారీ పిరియాడిక్ మూవీ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైమ్ పడుతుందట.
అందుచేత హడావిడిగా ఏదో చేసేసి రిలీజ్ చేయడం కంటే.. మంచి క్వాలిటీతో ఈ సినిమాని రిలీజ్ చేయాలని రిలీజ్ వాయిదా వేసారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ మూవీని జులై 12న రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఏప్రిల్ లో రిలీజ్ అని చెప్పారు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జులై 12 రాధేశ్యామ్ రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఏది కరెక్ట్ అనేది ఆసక్తిగా మారింది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Must Read ప్రభాస్ ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ బయటపెట్టిన నాగ్ అశ్విన్