ఎట్టకేలకు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఏపీ సిఎం జగన్ స్పందించారు. విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమంటూ వ్యాఖ్యనించారు. అటువంటి ఘటనలను ఖండిస్తున్నట్లుగా తెలిపారు. దేవునితో చెలగాటమాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్ పేర్రోన్నారు. రామతీర్థం ఘటనకు కారకులైన వారిని వెంటనే గుర్తించి, తగిని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం ఆదేశించారు.
రెండ్రోజుల క్రితం విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో రాములోరి విగ్రహం శిరస్సును కొందరు గుర్తుతెలియని దుండగులు ఖండించిన విషయం తెలిసిందే. దీనిపై హిందూ సనాతన ధర్మశాలల నుంచి ప్రతిపక్షాల వరకు చర్యలు తీసుకోవాలని రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందరి నుండి తీవ్ర ఒత్తిడి రావడంలో జగన్ స్పందించి ఉండచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కంటితుడుపు మాటలు కాదు.. చర్యలు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని హిందు ధర్మ పరిరక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదేమీ మొదటి సంఘటన కాదని.. ఇలా వరసగా జరుగుతున్నా కూడా ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించడం ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.











