సూపర్ స్టార్ మహేశ్ బాబుకి .. ఎన్నో వ్యాపారాలు. అందులో సినిమా నిర్మాణం కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. యం.బీ ప్రొడక్షన్స్ పేరుమీద .. తనే హీరో అని కాకుండా.. బైటి హీరోలతో కూడా సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఇప్పుడు అడివిశేష్ హీరోగా.. మేజర్ అనే బయోపిక్ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే…. మహేశ్ బాబు మరో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇంతకీ మహేశ్ సినిమా నిర్మిస్తున్నది వేరే ఎవరితోనో కాదు.. మన జాతిరత్నం నవీన్ పోలిశెట్టి తోనే. ‘జాతిరత్నాలు’ సూపర్ హిట్ తో ప్రస్తుతం ఇండస్ట్రీలో అతడి పేరు మారుమోగుతోంది. అందుకే అతడి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు మహేశ్ బాబు. దానికోసం మంచి దర్శకుడ్నే సెట్ చేశాడట. ‘భీష్మ’ మూవీ తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల . నవీన్ పోలిశెట్టి కలయికలో ఈ సినిమా రూపొందనుందట. మహేశ్ బాబు తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వెంకీ కుడుముల ఇప్పుడు ఇలా అతడి నిర్మాణంలోనే సినిమా చేయనుండడం అదృష్టంగా భావిస్తున్నాడట . మరి వెంకీ కుడుముల ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
Must Read ;- ఫరాన్ అఖ్తర్ ను ‘తుఫాన్’ లా తాకిన మహేశ్ ప్రశంస











