సందేశాత్మక సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డిది ఓ ప్రత్యేక శైలి. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం “హనీ ట్రాప్”. ఋషి, శిల్ప, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రదారులు భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వి.వి.వామన రావు నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. తొలి షెడ్యూల్లో భాగంగా. కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను తీస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వి వి వామనరావు మాట్లాడుతూ…’ఋషి ,శిల్ప, తేజులపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, అలాగే ఎమోషనల్ సన్నివేశాలను తీశాం. శివ కార్తీక్ రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. నేను కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నా.విశాఖ షెడ్యూల్ నెలాఖరుకు పూర్తవుతుంది. నేటిట్రెండ్ కు అనుగుణంగా ఈ సినిమాను సునీల్ కుమార్ రెడ్డి చాలా చక్కగా మలుస్తున్నారు` అని అన్నారు.
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ., ` సోషల్ థ్రిల్లర్ కథాచిత్రమిది యువ ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా చాలా ఉన్నాయి. నేటి సమాజంలోని సంఘటనల సమాహారమే ఈ చిత్రం. భీమిలి, అరకు తదితర లొకేషన్లలో చిత్రీకరణ చేస్తున్నాం. డిసెంబర్లో హైదరాబాద్ లో జరగబోయే రెండవ షెడ్యూలుతో షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ చిత్రానికి వామనరావు కథను కూడా అందించారు. జనవరికి ఈ చిత్రాన్ని సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో శివ కార్తీక్. వాసు, రామన్,, ఎఫ్ ఎం బాబాయ్ త దితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రవీణ్ ఇమ్మడి, సినెమాటోగ్రఫీని ఎస్ వి శివరాం అందిస్తున్నారు. కధ-స్క్రీన్ ప్లే-నిర్మాత వి.వి.వామనరావు. మాటలు, దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి.