February 10, 2026 8:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

డేంజర్ బెల్స్ : పాఠశాలలపై కోవిడ్ పడగ

ప్రభుత్వం పట్టుదలకు పోవడం కరెక్టు కాదు. టీచర్లకు కరోనా ముందేసోకి ఉంటుందనే సాకులు చెప్పడం కూడా  కరెక్టు కాదు. వ్యాప్తి నివారణకు సరైన పద్ధతేదో దానిని మాత్రమే వారు అనుసరించాలి.                  

November 6, 2020 at 9:16 AM
in Editors Pick, General, Latest News
AP School Reopening Post Covid-19 Lockdown
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో బడులు ప్రారంభం అయ్యాయి. విద్యాసంవత్సరం వృథా కాకుండా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని తప్పుపట్టలేం. అయితే పాఠశాలలు ప్రారంభమైన  వారంలోనే వందలాది  విద్యార్థులు, ఉపాధ్యాయలు  కోవిడ్ భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గిన సమయంలో పాఠశాలల ప్రారంభంతో మరలా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఏపీలో పాఠశాలలు తెరచి వారం గడవక ముందే 829 ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.  తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ పాఠశాలల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విద్యార్థులు కరోనా బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ చెబుతున్నా,  కోవిడ్  తాజా గణాంకాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది.

సామాజిక దూరం సాధ్యమేనా?

విద్యార్ధులను పాఠశాలల్లో సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మధ్య సాధ్యమైనంత దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. అయితే విద్యార్ధులు బడులకు వచ్చేప్పుడు ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణం చేయడం కరోనా వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. ఒక్కో ఆటోలో 15 మంది విద్యార్థులను కుక్కి పాఠశాలల వద్ద దింపుతున్నారు. బస్సుల్లోనూ సామాజిక దూరం పాటించడం లేదు. దీని ద్వారా విద్యార్ధులు, ఉపాధ్యాయులు ప్రయాణ సమయంలోనూ కరోనా భారినపడుతున్నారని తెలుస్తోంది.

ఉపాధ్యాయులే ఎక్కువగా కరోనా బారిన ఎందుకు పడ్డారు…

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో 96 శాతం మంది సమీపంలోని పట్టణాల నుంచి వారు పని చేసే పాఠశాలలకు ప్రయాణం సాగిస్తున్నారు.  పాఠశాలకు  25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉపాధ్యాయులు సొంత వాహనాల్లోనే దాదాపుగా పాఠశాలలకు వస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు వారు పనిచేసే పాఠశాలకు 60 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రాల నుంచి కూడా ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరంతా బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలా వీరు ప్రతి రోజూ ప్రయాణాలు చేయడం వల్ల కరోనా ఎక్కడైనా సోకే ప్రమాదం ఉంది. టీచర్లకు కరోనా వచ్చిందంటే ఆ ప్రమాదం విద్యార్ధులకు కూడా పొంచి ఉన్నట్టే. 

ప్రభుత్వం ఏం చేయాలి?

ముందుగా ప్రభుత్వం  ఉపాధ్యాయులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అనుమానం వచ్చిన ప్రతి ఉపాధ్యాయుడికి కరోనా టెస్టులు నిర్వహించాలి. కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించి వైద్య సేవలు అందించాలి. ముందుగా ఉపాధ్యాయుల ద్వారా విద్యార్ధులకు కోవిడ్ సోకే ప్రమాదాన్ని నివారించాలి. ఇక ప్రతి విద్యార్ధికి కరోనా టెస్టులు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వారి సంఖ్య ఏపీలోనే 72 లక్షలు ఉంది. వీరందరికీ కరోనా టెస్టులు సాధ్యంకాదు కనుక, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనుమానం వచ్చిన ప్రతివారి నుంచీ కరోనా శాంపిల్స్ సేకరించాలి. అలా కరోనా వచ్చిన వారిని ముందుగానే గుర్తించడం ద్వారా మిగతా వారికి వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఇక ముఖ్యంగా మధ్యాహ్న భోజన సిబ్బంది కూడా కరోనా భారినపడుతున్నారు. వారికి కరోనా వస్తే మరింత ప్రమాదం. వారు విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో పాఠశాల మొత్తానికి కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉంది. మధ్యాహ్న భోజన సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు తప్పనిసరి చేయాలి. 

ప్రారంభించే ముందు కరోనా పరీక్షలు చేశారు గానీ.. ఆ తర్వాత కూడా సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రతిరోజూ ప్రాణగండం కిందే లెక్క. అసంప్టమేటిక్ గా సోకితే.. వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

రెండు తరగతులు ప్రారంభిస్తేనే…

ప్రస్తుతానికి ఏపీలో 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో  అన్నీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇదే జరిగితే విద్యార్థి లోకం కరోనా భారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ఆన్ లైన్ క్లాజులు నిర్వహించి, విద్యాసంవత్సరం వృధా కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

మంత్రిగారి మాట

పాఠశాల ప్రారంభం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా రాలేదని విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ సెలవిచ్చారు. వీరు పాఠశాలలకు రాక ముందే కరోనా వచ్చి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కరోనా పాఠశాలలకు ప్రారంభానికి ముందే వస్తే అలాంటి వారిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా. అప్పట్లో పరీక్షలు కూడా నిర్వహించారు కదా.. మరి ఇప్పుడే ఎలా బయటపడుతున్నాయనేది ప్రశ్న.

కరోనా వచ్చిన వారిని క్లాసులకు ఎలా అనుమతించారు. కరోనా సోకిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకేచోట చేరితే కోవిడ్ అందరికీ వ్యాప్తించే ప్రమాదం ఉంది కదా? ఇవన్నీ ఆలోచించకుండా ఏదో విద్యార్థులను ఉద్దరిస్తున్నాం, అన్న చందంగా హడావుడిగా పాఠశాలలు ప్రారంభించారనే విమర్శలు వస్తున్నాయి. కరోనా ఈ విధంగా వ్యాప్తి చెందితే త్వరలో మరలా పాఠశాలలు మూసివేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పాఠశాలల ప్రారంభానికి ముందే వారికి కరోనా వచ్చిందా? పాఠశాలల ప్రారంభం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందా అనే విషయాలను కూడా పరిశీలించాలి. కరోనా సామాజిక వ్యాప్తి చెందుతోంది. కాబట్టి అన్నీ వర్గాల్లో కరోనా ఉండి ఉండవచ్చు. కానీ పాఠశాలల ప్రారంభం వల్ల అది మరింత మందికి సోకే ప్రమాదాన్ని అరికట్టాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే.

Tags: andhra pradesh cm ys jaganAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap cm ys jaganap coronavirusap state education ministercorona in schoolsCoronavirus infectionCoronavirus PandemicCovid-19 lockdownEast godavariNelloreschools reopeningSrikakulamstudents positiveSuresh Kumarteachers positivetelugu newstoday news ap telugu
Previous Post

అభిమానులకు 7వ తేదీ కమల్ పుట్టిన రోజు కానుక

Next Post

సెక‌నుకు క‌రోనా వైర‌స్‌ ప్ర‌యాణించే వేగం ఎంతో తెలుసా?

Related Posts

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

by లియో డెస్క్
February 10, 2026 3:14 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా...

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

by లియో డెస్క్
February 9, 2026 7:40 pm

రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ...

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

by లియో డెస్క్
February 9, 2026 2:16 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే...

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

by లియో డెస్క్
February 7, 2026 7:18 pm

జగన్‌ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన...

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

by లియో డెస్క్
February 6, 2026 1:45 pm

కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం...

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

by లియో డెస్క్
February 5, 2026 7:24 pm

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్‌ బాబాయ్‌.....

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

by లియో డెస్క్
February 4, 2026 7:58 pm

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం...

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

by లియో డెస్క్
February 2, 2026 1:21 pm

సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత...

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Actress Pragathi Latest Pics Going Viral

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

పోలవరానికి జగన్ గ్రహణం… 4ఏళ్లలో 4% పనులు కూడా చేయరా..? చంద్రబాబు హయాంలో 72% పనుల పూర్తి.. 24గంటల్లో 32,500క్యూమీ కాంక్రీటు గిన్నెస్ రికార్డు.. భారీ వాహనాలు, వేలాది కార్మికులతో కోలాహలం…ఆ స్ఫూర్తి ఇప్పుడేది..? ఏ ముఖం పెట్టుకుని పోలవరం వెళ్తున్నారు జగన్మోహన రెడ్డి..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హీటెక్కిన సాగర్ రాజకీయం.. టీఆర్ఎస్ నుంచి గురవయ్య యాదవ్, బీజేపీ తరపున రవినాయక్

ముఖ్య కథనాలు

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist