అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమయం ఆసన్నమవుతోంది. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం ఐపీఎల్ కు సంబంధించి ఏ వార్త వచ్చినా తెగ వైరల్ అవుతోంది. ఈ తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జర్సీని తీసుకొచ్చింది. జెఎస్డబ్ల్యూ గతేడాది నుంచి ఢిల్లీ ఫ్రాంసైజీకి స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. వరుసగా రెండో సారి ఢిల్లీతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తోంది.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మంచిగా రాణించింది. అనూహ్యంగా పుంజుకుంది. గత సీజన్లో టైటిల్ సాధిస్తుందనే ధీమాను అందరిలోనూ కల్పించింది. ముంబయితో జరిగిన ఫైనల్లో ఓటమిపాలై.. నిరాశతో వెనుదిరిగింది. ఈ సారి టైటిల్ను సాధించడమే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది.
Must Read ;- హైదరాబాద్ క్రికెట్ సంఘంలో ఐపీఎల్ మంటలు..