వైఎస్ జయంతి రోజున రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయా ? వైఎస్ఆర్ ఘాట్ దానికి వేదికైందా ? కన్నా తల్లిని, సొంత చెల్లిని జగన్ విస్మరించారా ? ఒకే చోట ఉన్నా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిచడం పై జరుగుతున్న చర్చ ఏమిటి ? అసలు ఇడుపులపాయాలో ఏం జరిగింది ?
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబంలో నెలకొన్న విబేధాలు బయటపడ్డాయనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి ఇడుపులపాయ వేదికైందనే ప్రచారం జోరందుకుంది.వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వైఎస్ ఘాట్ వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని కొందరు చర్చించుకుంటున్నారు.
వాస్తవానికి వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా చీలికలు ఏర్పడ్డాయనే ప్రచారం జరుగుతోంది.ఆస్తుల విషయంలో జగన్ కు షర్మిల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణమనే చర్చ కొనసాగుతోంది.గత క్రిస్మస్ సందర్భంగా అవి బహిరంగం అయ్యాయనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది. క్రిస్మస్ వేడుకలకు ఎప్పుడూ ఒక్కటిగా వచ్చే వైఎస్ కుటుంబం, గత సంవత్సరం మాత్రం ఎవరికి వారుగా వచ్చారు. ఇక అదే సమయంలో జగన్ కు షర్మిలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుందని, జగన్ తీరు నచ్చక షర్మిల పులివెందుల నుంచి అర్ధరాత్రి బయలుదేరి వెళ్లిపోయారనే ప్రచారం కూడా జరిగింది. కాగా తాజాగా వీరి మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డట్లుగా కనిపిస్తోంది.
గత కొద్ది రోజులుగా వైఎస్ కుటుంబం ఎవరికి వారే అనే తీరులో ఉంటున్నారు. జగన్, షర్మిల లకు అస్సలు పొసగడం లేదని టాక్. ఈ నేపధ్యంలోనే విజయమ్మ కూడా అటు జగన్ కు , ఇటు వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారట.ఇక అన్న చేతిలో దగా పడిన షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టి బిజీ అయిపోయారు. విజయమ్మ సైతం ఆమెకు అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ సైతం విజయమ్మను పక్కన పెట్టేసినట్లు వ్యవహరిస్తూ వస్తోంది.
ఈ నేపధ్యంలో ఈ సారి వైఎస్ జయంతికి ఆయన కుటుంబ సభ్యులు ఎలా హాజరు అవుతారనేది చర్చనీయాంశంగా మారింది.వైఎస్ కుటుంబం లో ఎటువంటి అరమరికలు లేవని వైసీపీ నేతలు ముఖ్యంగా విజయసాయి , సజ్జల వక్కాణించి చెబుతున్నప్పటికీ.. ఇడుపులపాయ సాక్షిగా వారి మధ్య విబేధాలు నిజమే అనేది బహిర్గతం అయ్యింది. వైఎస్ కు నివాళులు అర్పించేందుకు విజయమ్మ, షర్మిల కలిసి రాగా జగన్ మాత్రం ఆయన సతీమణి భారతీ రెడ్డితో వేరుగా వచ్చారు. ఇక అక్కడ చోటుచేసుకున్న సంఘటనలు కూడా వీరి మధ్య విబేధాలు నిజమే అనేలా కనిపించాయి.ముందుగా వైఎస్ ఘాట్ కు చేరుకున్న విజయమ్మ, షర్మిల వైఎస్ఆర్ కి నివాళులు అర్పించి అక్కడే కూర్చున్నారు. ఇక తర్వాత వచ్చిన జగన్ సైతం తనకు వారితో సంబంధం లేనట్లుగా నివాళులు అర్పించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.
అయితే ఎప్పుడూ వారి మధ్య కనిపించే ఆప్యాయ పలకరింపులు, ముద్దులు పెట్టుకోవడాలు ఇక్కడ దర్శనమివ్వకపోవడం గమనార్హం. ఇక జగన్ పక్కనే కూర్చున్న షర్మిల కుమారుడు సైతం తన మేనమామను కనీసం పాలకరించకపోవా, ఆయన వైపు చూపు కూడా తిప్పలేదు. జగన్ భార్య భారతీ రెడ్డి కూడా తనకు విజయమ్మ ,షర్మిలలతో సంబంధం లేనట్లుగా దూరంగా కూర్చోవడం, వారిని కనీసం పాలకరించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారిందట.
ఇదిలా ఉంటే వైఎస్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులా తీరుని చూసిన వైఎస్ అభిమానుల నుంచి ఇదేం చోద్యం అనే గుసగుసలు వినిపించాయట. వైఎస్ కుటుంబంలో విబేధాలు అంటూ వార్తలు వస్తుంటే ఇంతకాలం అదంతా తప్పుడు ప్రచారం అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే అదే నిజం అనిపిస్తున్నట్లు ఉందంటూ చెవులు కొరుక్కుంటున్నారట.
మొత్తం మీద తమది గౌరవ ప్రధమైన కుటుంబం అని, తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు లేవని వైఎస్ కుటుంబ సభ్యులు బయటకు ఎన్ని చెప్పియయ ఇడుపులపాయ సాక్షిగా వారి మధ్య విబేధాలు బహిర్గతం అయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.