ఉద్యోగుల చరిత్రలో ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇదే..!
ఫిట్మెంట్ విషయంలో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ద్వజమెత్తుతున్నారు. ఫిట్మెంట్ 23 శాతంగానే ప్రభుత్వం ప్రకటించడం ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 27 శాతం ఐఆర్ తీసుకుంటున్న ఉద్యోగులకు అంతకన్నా తక్కువగా ఫిట్మెంట్ ప్రకటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పింస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది. కొత్త జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనలో హెచ్ఆర్ఏ, సీసీఏ గురించి ప్రభుత్వం ప్రస్తావించకపోవడం గమనార్హం! హెచ్ఆర్ఏ తగ్గించాలని ఇప్పటికే సీఎస్ కమిటి సిఫార్స్ చేసింది. సీసీఏ( సిటి కాంపెన్సేటరి ఎలవెన్స్) గురించి సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తావించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం పెన్షన్ పై అధికారులు పెదవి విప్పలేదు. మొత్తం 71 డిమాండ్స్ లో ఒక్కదానిపై కూడా ఉద్యోగులకు స్పష్టనివ్వలేదు. ఫిట్మెంట్ 34 శాతం తగ్గకుండా ఇవ్వాలని కోరారు. అశుతోష్ మిశ్రా కమిటీ సూచనలు ఏ ఒక్కటి పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు మండిపడుతున్నారు. శుక్రవారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రెండు వారాల్లో అమలు చేసేలా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు పెంచిన ఫిట్మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.10,247 కోట్లు అదనపు భారం పడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.