ప్రభుత్వంతో చర్చలు అనవసరం..!
పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు రాష్ట్ర ఉద్యోగ సంఘాలు! మొన్న సీఎం జగన్ ప్రకటించిన 23 శాతం ఫిట్ మెంట్ ఆమోదయోగ్యంగా లేదంటూ ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేళా.. ఉద్యోగుల కూడా వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యంగా లేదని, దీనిని మరోసారి పున:పరిశీలించాల్సిందిగా సీఎస్ సమీర్ శర్మను కలిసి వినతి పత్రం అందజేశారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు! ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు.
నయవంచనకు మారుపేరు జగన్ రెడ్డి ప్రభుత్వం..!
ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు నయవంచనకు మారుపేరని సోషల్ మీడియా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వారంలో తీర్చేస్తా అని హామీ గుప్పించి.. వారి నుంచి ఓట్లు దన్నుకున్నారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటిని వారి సమస్యలు ఒకకొలిక్కి రాలేదు. 2010 లోనే అప్పటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 39శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, ప్రస్తుతం 30శాతం కూడా ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. 27శాతం ఐఆర్ ఉన్నప్పుడు 23 శాతం ఫిట్మెంట్ ను తాము ఎప్పుడు చూడలేదని వాపోతున్నారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం హయంలో ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ లో పీఆర్సీ 30 శాతం పీఆర్సీ ఉందని గుర్తు చేశారు. 70 – 79 మధ్యలో ఉన్న పెన్షనర్లకు అదనంగా 10శాతం పెన్షన్ ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 5 డీఏలు చెల్లించాలి, సీపీఎస్ రద్దు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రోబేషన్ డిక్లేర్ చేయాలంటూ పలు అంశాలతో కూడిన లేఖను సీఎస్ కు బుధవారం ఉద్యోగ సంఘాల నాయకులు అందజేశారు.