తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ మహిళా నేత ఈటలతో భేటీ అయ్యినట్లు వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచే కాకుండా, ఇతర పార్టీల నేతలు ఈటలతో సంప్రతింపులు జరుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. భట్టి ఇంటికి ఈటల సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. వీళ్లిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఇద్దరు భేటీ అయినట్టు వార్తలు వినవస్తున్నా.. కారణాలు మాతం వేరే ఉన్నాయి. కాంగ్రెస్ లోకి రావాలని ఈటలను భట్టి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈటల సానుకూలంగా స్పందిస్తూనే.. తగిన సమయం కోరినట్లు సమాచారం. మరో సీనియర్ నేత డి.శ్రీనివాస్ తో ఈటల సంప్రతింపులు జరపడంతో రాజకీయాంగా ఆసక్తి సంతరించుకుంది. మొత్తానికి ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణాపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











