పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఆస్థానమండపంలోని దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 84వ నెంబరు దుకాణంలో మంటల్లోనే ఓ వ్యక్తి పూర్తిగా కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో అతన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతం వల్లేనా..
తిరుమలలో విద్యుధాఘాతం వల్లే మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది ప్రాధమికంగా గుర్తించారు. ఆస్థానమండపం వద్ద 4 షాపులు పూర్తి కాలి బూడిదయ్యాయి. దాదాపు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. తిరుమలలో తరచూ అగ్గి ప్రమాదాలు జరుగుతున్నా, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.











