పంతాలు.. పట్టింపులు.. మొట్టికాయలు.. తీర్పులు.. ఇలా పలు మలుపులు తిరుగుతూ.. చివరకి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు తెరదించింది ఎన్నికల కమిషన్. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతలో 2 వేల 731 పంచాయతీలకు జరుననున్నాయి. పోలీంగ్ కేంద్రాలకు బ్యాలెట్ బ్యాక్సులు తరులిస్తున్నారు అధికారులు. స్థానిక కమిషనర్లు డ్యూటీల గురించి సిబ్బందికి వివరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది ఎలా సమన్వయం చేసుకోవాలి.. పోలింగ్ జరుగుతున్న సమయంలో వారి పనులు ఎలా ఉంటాయి.. ఏమేమీ నిర్వహించాలి అనే విషయాలపై సిబ్బందికి ట్రైనింగ్ రూపంలో అవగాహాన కల్పిస్తున్నారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు వివరించారు. సిబ్బందికి అవగాహానా సదస్సులతోపాటు.. అన్ని ప్రాంతాలకు అందాల్సిన బ్యాలెట్ బాక్సులు, మిగిలిన వస్తువులను అందేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలియజేశారు.
Also Read: కొట్టి కొట్టి చంపేస్తాం.. పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు..