తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని క్షురకులు, రజక వృత్తిదారులకు గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గల కటింగ్ షాపులకు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీఓను జారీ చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్ 1వ తారీఖు నుంచే అమల్లోకి రానుంది. కేసీఆర్ నిర్ణయంతో ప్రతినెలా 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఙప్తులను పరిశీలించి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Must Read ;- భయంతో కూడిన గౌరవమా.. కేసీఆర్ సాబ్ ఏంటా రహస్యం?