గద్వాల్ విజయలక్ష్మీ.. తెరాస తరపున మేయర్గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమెకు అభినందనలు తెలియజేస్తూ.. కొందరు అభిమానులు హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ కాస్త సీరియస్ అయింది. హోర్డింగులకు సీరియస్ అవడం ఎందుకండి అనుకుంటున్నారా? మేయర్కే గా తెలిపింది తప్పేముంది అనుకుంటున్నారు కదూ.. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. మేయరే కదా అభినందన హోర్డింగ్గులు ఏర్పాటు చేయడానికి అనుమతులు కావాలా ఏంటి అనుకున్నారు. కానీ, వారి ఆలోచనలకు జీహెచ్ ఎంసీ గట్టి షాకిచ్చింది.
Must Read ;- చక్రం తిప్పిన కేకే.. మేయర్ అభ్యర్థి ఆయన కుమార్తె విజయలక్ష్మి
Hello @Director_EVDM @CEC_EVDM, Can you please convey Mr. Atish Agarwal “special thanks” on behalf of the first citizen for dirtying the city! @GadwalvijayaTRS
Location: Himayatnagar X Roads @KTRTRS @SomeshKumarIAS @SmitaSabharwal @arvindkumar_ias pic.twitter.com/L4FfjJqtqy
— Robin Zaccheus (@RobinZaccheus) February 12, 2021
ఈ హోర్డింగ్స్ చూసిన ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా కంప్లెయంట్ ఫైల్ చేయడంతో.. దానిపై వెంటనే స్పందించిన తదితర డిపార్ట్మెంట్ వెంటనే చలానా జారీ చేసింది. ఎంతనుకుంటున్నారు. దాదాపు 4.15 లక్షల జరిమానా పడింది. నాలుగు చలానాలు జారీ చేసింది జీహెచ్ఎంసీ. చలానాలు వివరాలు చూస్తే.. ఒకటి 2 లక్షలు, మరో రెండు హోర్డింగులకు చెరో లక్ష.. ఇంకో హోర్డింగ్కు 15 వేలు జరిమానా విధిస్తూ చలానాలు జారీ చేసింది.













