సిఎం జగన్ పై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ ధనదాహంతో ఊరూ పేరూలేని మద్యం, కల్తీసారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ సర్కార్ నాసిరకం మద్యంతో ఏటా 5 వేల కోట్ల రూపాయలు దండుకుంటోందని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం తయారీ సంస్థలన్నీ మంత్రులు, వైసీపీ నేతలవేనన్నారు. మంత్రి బొత్స, ఎంపీ మిథున్రెడ్డికి చెందిన డిస్టిలరీ కంపెనీలతో పాటు నెల్లూరు ఎస్ఎన్జే కంపెనీ మద్యంలో హానికర రసాయనాల మిళితమేనని తేలిపోయిందని సోమిరెడ్డి తెలిపారు. కల్తీ మద్యం తాగేవారి మెదడు, నాడీ, జీర్ణ వ్యవస్థ దెబ్బతిని వారు ప్రాణాలు కోల్పోతున్నారని ల్యాబ్ నివేదికలో తేలిందని ఆయన స్పష్టం చేశారు.ఇక పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలు ప్రభుత్వ హత్యలేనన్న ఆయన, 28 మంది ప్రాణాలు కొల్పవక ముందే ప్రభుత్వం నాటు సారా నిల్వలను ధ్వంసం చేసి ఉండాల్సిందన్నారు.
Must Read:-అనగనగా ఓ జంగారెడ్డిగూడెం బస్సు..! నీట్లో కలిసిన పది ప్రాణాలు.. దాగిన నమ్మలేని నిజాలు..!!