ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారిణి. ఒక్క పండే కాదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మనదేశంతో పాటు, పాకిస్థాన్, ఇండోనేషియాలలో ప్రధానంగా పెరుగుతుంది. ఈ పండు ఇప్పటిది కాదట. శ్రీరాముడు వనవాసంలో ఈ పండును తిన్నాడని పురాణాలు సైతం చెప్తున్నాయి. అందుకే నేరడుతో బొలెడు లాభాలున్నాయి.

రోగ నిరోధశక్తి పెంపు
ఆస్తమా, బ్రొకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరమవుతాయి. కాల్షియం, పొటాసియం, ఇనుము, విటమిన్-సీ అధిక మోతాదులో ఉంటాయి కనుక వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
లాభాలు ఎన్నో..
అల్లనేరేడు చెట్టు ఆకులను ఇంటి ద్వారానికి తోరణాలుగా కడితే ఇంట్లోకి హానికారక క్రిములు, బాక్టీరియా, వైరస్లు రాకుండా ఉంటాయి. అల్లనేరేడు పండ్లు లివర్కు మేలు చేస్తాయి. లివర్ను శుభ్రం చేస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. కడుపులోకి ప్రమాదవశాత్తూ చేరే తల వెంట్రుకలు, లోహపు ముక్కలను కూడా అల్లనేరేడు పండ్లు కరిగిస్తాయి. శరీరంపై కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లపై అల్లనేరేడు ఆకుల మిశ్రమాన్ని రాసి కట్టు కడితే త్వరగా గాయాలు తగ్గుతాయి. అల్లనేరేడు చెట్టు బెరడు లేదా పుల్లలతో దంతాలను తోముకుంటే దంత సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అల్ల నేరేడు గింజల చూర్ణంలో కొద్దిగా ఉప్పు కలిపి దాంతో దంతాలను తోముకోవచ్చు.












