నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారాయి. దీంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. నేడు, రేపు నైరుతి, మధ్య తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం అధికారులు చెప్పుతున్నారు. బుధవారం తెలంగాణతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణలో కొన్ని చోట్లా ధాన్యం గోదాములు లేక రైతుల పంటలు వర్షానికి తడిసిపోయాయి.
Must Read ;- తెలంగాణలో జూన్ 10 వరకు లాక్డౌన్ పొడిగింపు.. మరో నాలుగు గంటలు సడలింపు