బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది.ఈ యాస్ తుఫాను ప్రభావం ఏపీపై పెద్దగా ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.తూర్పు మధ్య బంగాళాఖాతంలో పోర్ట్ బ్లెయిర్కు 500కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన యాస్ తుఫాను 26వ తేదీ ఒడిషా,పశ్చిమబెంగాల్ మధ్య తీరందాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.తుఫాను ప్రభావంతో ఒడిషా,పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 150కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండి తెలిపింది.తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ఒడిషా,పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.యాస్ తుఫాను నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.ఒడిషా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఏపీలో వర్షాలు పడే అవకాశం..
యాస్ తుఫాను ప్రభావం ఏపీపై పెద్దగా ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.అయితే కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.తుఫాను తీరం దాటే సమయంలో ఏపీలో 60నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాద ముందని హెచ్చరించారు.ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాస్ తుఫాను ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది.యాస్ తుఫాను ముప్పు తెలుగు రాష్ట్రాలపై అంతగా ప్రభావం చూపదని భారత వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసింది.
Must Read ;- అప్రమత్తమైన కోస్ట్ గార్డ్.. ఈస్ట్రన్ నేవల్ కమాండ్..