దేశమంతా మెల్ల మెల్లగా డిజిటలైజేషన్ వైపు మళ్లుతుంది. అన్ని రంగాలలో క్యాష్ లెస్ కొనుగోళ్లు వైపు ఆసక్తి చూపుతున్నారు. చివరకు రోడ్డు పక్కన చిన్న బండిపైన అమ్ముకునే వారు కూడా క్యాష్ లెస్ కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. కానీ, ఇంకా సిటిబస్లలో క్యాష్ లెస్ టికెట్లు మాత్రం లేవు. బస్ పాస్ లను ఇస్తున్నారుగా.. కానీ.. అది కొనాలంటే బస్ని మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ నెల మీరు పాస్ సరిగా ఉపయోగించకపోయినా.. ఆ నెలతో సరి. అది మీకు పక్క నెలకు వర్తించదు.
ఇకపై ఇలాంటి సమస్యలు లేకుండా.. మీకు నచ్చినంత రీఛార్జ్ చేసుకుని టికెట్లు తీసుకనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ సిటీ బస్ అధికారులు. దాదాపు మెట్రో ట్రైన్ల పద్దతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనమాట. కాకపోతే, అక్కడ మీరు ట్రైన్ ఎక్కే ముందే చెల్లిస్తారు. ఇక్కడ బస్ ఎక్కాక మీరు దిగే స్టేజ్ని బట్టి మనీ కట్ అవుతుంది. వావ్ ‘క్యాష్ లెస్’ సిటి బస్సులొచ్చేస్తే.. ఇక చిల్లర గొడవలే ఉండవు కదా.. ఎంతో హాయి..
రూట్ నెంబర్ 16..
ఇది పూర్తి స్థాయిలో అములులోకి రావడానికి కాస్త టైం పడుతుందండి. ఈ ప్రక్రియలోని లాభ నష్టాలను బేరీజు వేయడానికి.. ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్-కుషాయిగూడ మధ్య రూట్ నెంబర్ 16లో తిరిగే బస్సులకు దీన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. అందుకోసం యాప్ డెవలెప్మెంట్లో అనుభవమున్న ఓ కంపెనీకి పని అప్పగించినట్లు సమాచారం. వారు ఈ రూట్లో ప్రయోగాత్మకంగా ఈ క్యాష్ లెస్ టికెట్ల ప్రక్రియను పరిశీలించి అధికారులకు నివేదిక అందివ్వాలి. దాన్ని బట్టి కార్డ్స్ ఎలా అందించాలి? వాటిని రిఛార్జ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలపై స్పష్టత వచ్చాక ప్రజల్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణియించారు.
ప్రాధమిక నిర్ధారణ ఇలా ఉంది..
మొదటగా ఈ కార్డు కొనాలనుకునే వారు 30 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఆపై కార్డులో మీకు నచ్చినంత రిఛార్జ్ చేసుకోవచ్చు. మినిమమ్ ఎంత రిఛార్జ్ ఉండాలనేది తొందరలో అధికారులు వెల్లడిస్తారు. బస్ ఎక్కిన తర్వాత మీరు దిగాల్సిన స్టేజ్ని బట్టి మీ రిఛార్జ్ కార్డులోని డబ్బు కట్ అవుతుంది. అధికారులు అనుకున్న ప్రయోగం విజయవంతమైతే.. తొందరలోనే మనమంతా హైదరాబాద్ సిటిబస్సులలో క్యాష్ లెస్ ప్రయాణాలు సాగించవచ్చు.
Must Read ;- మధ్యప్రదేశ్లో బస్సు ప్రమాదం.. 47మంది మృతి











