విజయవాడ గుణదల డివిజన్ మూడో వార్డులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వాణిఫై దాడి చేయడాన్ని ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఖండించారు. పద్థతి మార్చు కోవాలని దేవినేని అవినాష్ను ఎంపీ సూటిగా హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం పదవి అనుభవించి తర్వాత పార్టీ పిరాయించడంపైన విమర్శించారు. విజయవాడ ప్రజలు శాంతి భద్రతలను కోరుకుంటున్నారని, గుండాయిజం మానుకోకపోతే మహిళలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. మహిళపై దాడి చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఎంపీ ప్రశ్నించారు. పోలీసులు పద్ధతి మార్చుకుని శాంతి భద్రతలను కాపాడాలన్నారు. విజయవాడలో టీడీపీ విజయం ఖాయమన్నారు. ఎమ్మెల్యే గద్దె రాంమోహన్తో కలిసి ఎంపీ ఆ వార్డులో ఫ్రచారం నిర్వహించారు.
Must Read ;- సీటు కోసం సిగపట్లు.. టీడీపీలో విజయవాడ మేయర్ పంచాయితీ!











