బాక్సింగ్ డే టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మ్యాచ్పై పట్టు బిగిస్తోంది. అల్రౌండర్ ప్రతిభతో విజయం అంచుల్లో గెలుపు కోసం వేచిచూస్తోంది. భారత్ రెండోరోజు మరో 49 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ను సైతం అదేరీతిలో కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత పరిస్థితులు అన్నీ చూస్తుంటే.. బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది!
బాక్సింగ్ డే టెస్టులో 277/5 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 49 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె(112; 223 బంతుల్లో 12×4) కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు రవీంద్ర జడేజా(57; 159 బంతుల్లో 3×4) అర్ధశతకం బాదాడు. టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులు చేసింది. దాంతో ఆస్ట్రేలియాపై 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. కంగారూ బౌలర్లలో స్టార్క్, లైయన్ 3 వికెట్లు తీయగా, కమిన్స్ 2, హేజిల్వుడ్ 1 పడగొట్టారు.
ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ..
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ను ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమేశ్ యాదవ్ ఓపెనర్ జో బర్న్స్(4) నాలుగో ఓవర్లోనే ఔట్ చేయడంతో భారత్కు తొలి వికెట్ దక్కింది. లబుషేన్ను అశ్విన్ బంతితో బోల్తా కొట్టించాడు. ఢిపరెన్స్ ఆడబోయి స్లిప్లో ఉన్న రహానె చేతికి చిక్కాడు. స్మిత్(8)ను కూడా బుమ్రా సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం కామరూన్ గ్రీన్(17), పాట్ కమిన్స్(15) క్రీజులో ఉన్నారు. ఇక మంగళవారం ఆస్ట్రేలియా టెయిలెండర్లను భారత బౌలర్లు ఎంత త్వరగా ఔట్ చేస్తారనే విషయంపైనే విజయం ఆధారపడింది.
గమ్మత్తుగా స్మిత్ అవుట్ …
స్మిత్ అవుట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి ఆ విషయం ఆయనకు కూడా అర్థం కాలేదు. బంతి తగిలీ తగలనట్టు లెగ్సైడ్ లో తాకడంతో బెయిల్స్ ఎగిరిపోయాయి. దీంతో అతను క్రీజ్ నుంచి వెనుతిరిగాడు. ఆ తర్వాత వేడ్, టిమ్పైన్(1) జడేజా ఔట్ చేయగా.. మహ్మద్ సిరాజ్ ట్రావిస్ హెడ్(17)ను పెవిలియన్కు పంపాడు. 99 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. ప్రస్తుతం కామరూన్ గ్రీన్(17), పాట్ కమిన్స్(15) క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సమయానికి జట్టు స్కోరును 133/6 వద్ద నిలిపారు.
నోరుపారేసుకున్న మాథ్యవేడ్…
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు బ్యాట్స్మన్ మాథ్యవేడ్ టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ పంత్పై నోరు పారేసుకున్నాడు. “మళ్లీ నిన్ను నువ్వు పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటున్నావా? నువ్వు అలా చూసుకోవడం చాలా సరదాగా ఉంది” అని అన్నాడు. ఆ మాటలు స్టంప్ మైక్లో వినిపించడం వల్ల ఓ ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్సైట్ ఆ వీడియోను ట్విటర్లో పంచుకుంది.
పైన్ నాటౌట్.. రహానె ఔట్ ఎలా?
తొలి ఇన్నింగ్స్లో మూడో రోజు ఆటలో రహానె బ్యాట్ క్రీజులైన్పై ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ అతడిని ఔట్గా ప్రకటించారు. తొలిరోజు ఆటలో టిమ్పైన్ను నాటౌట్గా ప్రకటించడం ఇప్పటికే వివాదాస్పదమైంది. అంపైర్ల నిర్ణయాన్ని వార్న్ సహ పలువురు మాజీలు తప్పుబట్టారు. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్తో’ పైన్ను నాటౌట్గా ప్రకటించిన వారు రహానె అంశాన్ని ఎందుకు అదే కోణంలో చూడడం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.