ప్రకాశం జిల్లా, ఓంగోలుకు చెందిన తేజస్వినీ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తేజస్విని తల్లిదండ్రులు బంగారు వృత్తి చేసుకుంటున్నారు. నాగేశ్వరరావు, విజయల చిన్న కుమార్తైన తేజస్విని, స్థానికంగా క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతుంది. రోజూలాగే శుక్రవారం కూడా కాలేజీ వెళ్లి వచ్చింది. బయటకు వెళ్లిన తల్లి తిరిగి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేసరికి ఉరి వేసుకుని కనిపించింది. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
పోలీసుల కధనం ప్రకారం, తన చదువుకు సంబంధించిన ఫీజులను తల్లిదండ్రులు కట్టలేక ఇబ్బందిపడుతుండడంతో కొంతకాలంగా తేజస్విని మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాలేజ్ ఫీజు కట్టలేక.. ఉరి వేసుకుని చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ కాలేజ్ వాళ్ల కధనం ఇందుకు భిన్నంగా ఉంది. తేజస్విని కాలేజ్ ఫీజ్ కట్టిందని.. పరీక్షలకు సిద్దమవుతుందని చెప్తున్నారు. మన ఆత్మహత్యకు.. కాలేజ్ ఫీజ్కు సంబంధం లేదని అంటున్నారు కాలేజ్ యాజమాన్యం. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పందించడంతో పాటు విద్యార్ధి సంఘాలు భగ్గుమనడంతో ప్రభుత్వం స్పందించింది.
నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోంది. వెంటనే విద్యార్థుల సమస్యలన్నిటినీ పరిష్కరించాలి. అలాగే తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 6, 2021
ప్రభుత్వ వైఖరి వల్లే ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/0KcDr4D5Ck
— JanaSena Party (@JanaSenaParty) February 6, 2021
తేజస్విని మృతిపై విచారణ కమిటీ వేస్తున్నట్లు తెలిపింది. వారందించే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని మంత్రి ఆదిమూలపు ప్రకటించారు.