తెలుగు బెస్ట్ కామెడి షోగా క్రేజ్ తెచ్చుకున్న ‘బజర్దస్త్’.. కరోనా కోరల్లో చిక్కుకుంది. ఇటీవలే బజర్దస్త్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కరోనాతో బాధపడుతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ల సలహాతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాడని సమాచారం. అయితే ఇప్పుడు ‘బజర్దస్త్’ స్టార్ యాంకర్ రష్మీకి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈవార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కొందరు ఈవార్త నిజమే అంటుంటే మరికొందరు అబద్దం అని అంటున్నారు. ఏదిఏమైనా రష్మీ మాత్రం హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ తన ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకుంటుందని సమాచారం.
ఇప్పటికే ఈమెతో మసలిన వారు టెస్టులు చేయించుకున్నారని వారికి మాత్రం నెగిటివ్ వచ్చిందని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అఫీషియల్ గా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. కేవలం సోషల్ మీడియాలో, అలాగే కొన్ని ప్రముఖ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ‘బజర్దస్త్’ షోకు పనిచేస్తున్న అనేకమందికి కరోనా సోకినట్లు సమాచారం. రీసెంట్ గా దసరా కోసం కొన్ని స్పెషల్ ప్రోగ్రాంలు కూడా నిర్వహించగా అందులో సుధీర్, రష్మీలతో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నట్లు టాక్. ఈ కరోనా కారణంగా కొన్ని వారాలపాటు ‘బజర్దస్త్’ షో వాయిదా వేస్తునట్లు తెలుస్తోంది. ‘బజర్దస్త్’ షో వాయిదా పడినట్లు మల్లెమాల సంస్థ కాని, సదరు ఛానల్ కాని ఇప్పటివరకు ఏవిధంగాను స్పందించలేదు.
రష్మీకి కరోనా సోకిన వార్తలపై స్వయంగా ఆమె స్పందిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే రష్మీ స్వయంగా స్పందించే వరకు ఆగాల్సిందే. మరోవైపు ఆమె అభిమానులు మాత్రం రష్మీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. తమ అభిమాన యాంకర్ వీలైనంత త్వరగా ‘బజర్దస్త్’ షోలో జాయిన్ అవ్వి తమను ఆనందింపచేయాలని వారు కోరుతున్నారు. ఈవార్త నిజమైతే రష్మీ త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.