ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఈ నెల 14న తలపెట్టిన తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభ రద్దయింది. ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అందుకే రాలేకపోతున్నట్టు సీఎం జగన్ తెలిపారు. నిన్న ఒక్క రోజే ఏపీలో 2765 కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన తిరుపతి ప్రజలకు రాసిన లేఖలో తెలిపారు. గడచిన రెండు రోజుల్లోనే చిత్తూరు జిల్లాలో నలుగురు రోగులు కరోనాతో చనిపోయారని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తాను రాలేకపోయినా, తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి ఓట్లు వేసి గెలిపించాలని సీఎం జగన్ కోరారు.
ప్రజల ప్రాణాలు ముఖ్యం
ఏపీలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజల ప్రాణాలే తనకు ముఖ్యమని, అందుకే తిరుపతి బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నట్టు సీఎం తిరుపతి ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో వెల్లడించారు. ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ పథకాలు చూసి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ఆయన విజ్ఙప్తి చేశారు. బహిరంగ సభకు భారీగా జనం పోగయ్యే అవకాశం ఉండటంతో సీఎం తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
Must Read ;- ప్రమాణానికి నేను సిద్ధం.. జగన్ రెడ్డి సిద్ధమా : నారా లోకేష్













